News April 11, 2024
BREAKING: ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం

IPL-2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ ఆఖరి బంతికి టార్గెట్ను చేధించింది. ఆ జట్టు బ్యాటర్లలో గిల్ 72, సుదర్శన్ 35 రన్స్తో రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియా(22), రశీద్ ఖాన్(24*) బౌండరీలు బాది తమ జట్టుకు విజయాన్నందించారు.
Similar News
News March 25, 2026
పొదుపులో మహిళలు మహారాణులే.. కానీ!

డబ్బు దాచడంలో భారత మహిళలు ముందున్నా పెట్టుబడుల విషయంలో మాత్రం వెనకబడే ఉన్నారు. తాజా నివేదిక ప్రకారం 70%మంది మహిళలు పొదుపు చేస్తున్నారు. అయితే ఇందులో 40%మంది మాత్రమే FD, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులపై కాకుండా షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవగాహన లేకపోవడం, నష్టభయం వల్ల చాలామంది వీటికే పరిమితమవుతున్నారు. ఎక్కువ మంది తమ ఆదాయంలో 10% కంటే తక్కువ పెట్టుబడి పెడుతున్నారట.
News March 25, 2026
ఇందిర అంటే గౌరవమే.. తప్పేమీ మాట్లాడలేదు: రాకేశ్ రెడ్డి

TG: అసెంబ్లీలో ఇందిరపై తన <<19474706>>వ్యాఖ్యల<<>> పట్ల దుమారం రేగడంపై బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘ఇందిరా గాంధీ ఉక్కుమహిళ, ఆమె అంటే మాకు గౌరవమే. నేను తప్పేమీ మాట్లాడలేదు. అనేక పథకాలకు ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇప్ప సారా తయారుచేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. క్షమాపణ చెప్పాల్సి వస్తే చెప్తా. తమాషా చేయొద్దని మంత్రి నన్ను బెదిరిస్తున్నారా?’ అని అన్నారు.
News March 25, 2026
బెంగాల్ దంగల్: TMC పైకి BJP ‘పేస్’ అస్త్రం?

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ త్వరలోనే బీజేపీలో చేరి, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్తో నిన్న ఆయన భేటీ కావడంతో ఈ చర్చ మొదలైంది. అసెంబ్లీ పోరులో అధికార TMCని ఢీకొడుతున్న BJP.. పేస్ను అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 2021లో TMCలో చేరిన పేస్ కొన్నాళ్ల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు.


