News March 22, 2025

BREAKING: కాసేపట్లో భారీ వర్షం

image

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 11 గంటల వరకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

Similar News

News January 21, 2026

పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

image

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్‌పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.

News January 21, 2026

రూ. లక్ష జీతంతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

image

<>సుప్రీంకోర్టు <<>>90 లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. LLB, ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీతో పాటు బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా ఎన్‌రోల్ అయినవారు FEB 7 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 20- 32 ఏళ్ల మధ్య ఉండాలి. మల్టీపుల్ ఛాయిస్, కాంప్రహెన్షన్ స్కిల్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.లక్ష జీతం చెల్లిస్తారు. సైట్: https://www.sci.gov.in/

News January 21, 2026

ఉ.10 గం. వరకు పొగమంచు.. వాహనదారులు జాగ్రత్త!

image

AP: మరో రెండు రోజుల పాటు తెల్లవారుజాము నుంచి ఉ.10 గం. వరకు పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల విజిబిలిటీ వంద మీటర్ల కంటే తక్కువగా నమోదవుతుందని, యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు కోస్తా, రాయలసీమలో చలి తీవ్రత పెరిగింది. నిన్న అరకు లోయలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.