News March 29, 2024

BREAKING: టీడీపీలో చేరిన హీరో నిఖిల్

image

AP: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఈ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

Similar News

News March 17, 2026

పాక్ మిలిటరీ హత్యలకు పాల్పడుతోంది: అఫ్గాన్ క్రికెటర్లు

image

తమ దేశంలోని ఆస్పత్రిపై పాకిస్థాన్ <<19403539>>వైమానిక దాడి<<>> చేయడాన్ని అఫ్గానిస్థాన్ క్రికెటర్లు ఖండించారు. రంజాన్ మాసంలో పాక్ మిలిటరీ హత్యలకు పాల్పడుతోందని రషీద్ ఖాన్, నబీ మండిపడ్డారు. ఆస్పత్రులు, స్కూళ్లు, గృహాలపై దాడి చేయడం వార్ క్రైమ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై UN దర్యాప్తు చేసి నేరస్థులకు శిక్ష విధించాలని కోరారు. పాక్ దాడిలో దాదాపు 400 మంది మరణించారు.

News March 17, 2026

రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

image

TG: డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాలతో BRS షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పార్టీకి చెందినవారు అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ వంటి వాటితో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉండటాన్ని BRS పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేసింది.

News March 17, 2026

డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. DCP యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. గత శనివారం TDP MP పుట్టా మహేశ్, BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్, ఢిల్లీ వ్యాపారి నమిత్ సహా మరికొందరు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. ఈ కేసులో మహేశ్‌కు స్టేషన్ బెయిల్ రాగా రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్‌కు రిమాండ్ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.