News July 6, 2024
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.650 పెరిగి రూ.67,650కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.710 పెరగడంతో రూ.73,800 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,600 పెరిగి రూ.99,300కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
Similar News
News April 8, 2026
IPL: గిల్ రీఎంట్రీ.. GT బోణీ కొడుతుందా?

ఐపీఎల్లో ఈరోజు ఢిల్లీ వేదికగా DC, GT రా.7.30 గంటలకు తలపడనున్నాయి. ఈ సీజన్లో DC ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి ఫామ్లో ఉండగా, GT ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. దీంతో ఈరోజైనా గెలిచి ఆ జట్టు బోణీ కొడుతుందేమో చూడాలి. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 7 సార్లు తలపడగా, GT 4 విజయాలతో పైచేయి సాధించింది. కండరాల నొప్పితో గత మ్యాచ్కు దూరమైన గుజరాత్ కెప్టెన్ గిల్ ఈ మ్యాచులో ఆడనున్నారు.
News April 8, 2026
ఇరాన్కు డెడ్లైన్ గడువును పొడిగించిన ట్రంప్

ఇరాన్కు విధించిన డెడ్లైన్ గడువును 2 వారాలపాటు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. <<19594813>>పాక్ అభ్యర్థన<<>> మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానన్నారు. ‘హార్ముజ్ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి నేను ఒప్పుకున్నా. ఈ సీజ్ఫైర్ ఇరువైపులా వర్తిస్తుంది. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ అందింది. శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
News April 8, 2026
నోటిఫైడ్ డిసీజ్గా క్యాన్సర్.. ప్రతీ కేసు వివరాలు చెప్పాల్సిందే!

TG: క్యాన్సర్ను నోటిఫైడ్ డిసీజ్గా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడ క్యాన్సర్ కేసు నమోదైనా ప్రభుత్వానికి సమాచారమివ్వాలని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను ఆదేశించింది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచి, వాటిని నెల రోజుల్లో ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయాలని సూచించింది. సరైన వైద్య విధానాల రూపకల్పనకు, స్క్రీనింగ్ టెస్టులు చేసేందుకు ఈ డేటా సాయపడుతుందని అధికారులు తెలిపారు.


