News January 3, 2025
BREAKING: HYD: ఉప్పల్లో టీచర్పై కేసు నమోదు..!
ఓ స్కూల్లో పిల్లాడిని కొట్టాడని టీచర్పై తల్లిదండ్రులు కేసు పెట్టిన ఘటన ఉప్పల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ గణేశ్నగర్లోని కాకతీయ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13ఏళ్ల బబ్లూ దాస్ జామెట్రీ బాక్స్ తేలేదని, హోంవర్క్ చేయలేదని మ్యాథ్స్ సబ్జెక్టు టీచర్ ఘనశ్యామ్ విద్యార్థి భుజంపై కొట్టాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 22, 2025
అర్హుల ఎంపికకే గ్రామసభలు: MRO జయరాం.!
అర్హుల ఎంపికకే గ్రామసభలు నిర్వహింస్తున్నామని MRO జయరాం అన్నారు. నవాబ్పేట్ మండలంలోని మీనేపల్లికలాన్, ముబారక్పూర్ గ్రామాలల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో MRO పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 24 వరకు గ్రామసభలు నిర్వహిస్తామన్నారు. అర్హత ఉండి జాబితాలోలేని వారి గురించి ఇక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లో మళ్లీ దరఖాస్తులను స్వీకరించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి తుది జాబితాను రూపొందిస్తామన్నారు.
News January 22, 2025
VIRAL: MLA పద్మారావు లేటెస్ట్ ఫొటో
సికింద్రాబాద్ MLA T.పద్మారావు గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వ్యక్తిగత పనులతో ఆయన ఆదివారం డెహ్రాడూన్ వెళ్లారు. ఛాతిలో నొప్పి రావడంతో అక్కడే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు స్టంట్ వేసి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. అయితే, డెహ్రాడూన్లోని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పద్మారావు కోలుకున్నారని, ఆస్పత్రిలో కుటుంబీకులతో దిగిన ఫొటోలను బీఆర్ఎస్ శ్రేణులు షేర్ చేస్తున్నాయి.
News January 22, 2025
HYDలో ఒకే ఒక పోస్ట్.. శాలరీ రూ. 1,25,000
జర్నలిజంలో అనుభవం ఉన్నవాళ్లకు ఇదొక గొప్ప అవకాశం. నెలకు రూ. 80 వేల నుంచి రూ. 1,25,000 వేతనం పొందవచ్చు. ఇటీవల ప్రసార భారతి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ బేసిక్ కింద హైదరాబాద్లో సీనియర్ కరస్పాండెంట్ ఒక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, PG డిప్లొమా, MCJ చేసినవారు అర్హులు. మీడియా రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు లాస్ట్ డేట్: JAN 31.
LINK: https://prasarbharati.gov.in
SHARE IT