News May 13, 2024
BREAKING: HYD: పోలింగ్ కేంద్రంలో మహిళ మృతి!
HYD ఉప్పల్ భరత్ నగర్ ప్రాంతానికి చెందిన గట్టు విజయలక్ష్మి స్థానిక ఆంధ్ర యువత మండలి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ స్టేషన్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే పోలింగ్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించగా గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 7, 2024
HYD: యాక్సిడెంట్లో చనిపోయింది వీరే..!
HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ PS పరిధిలో <<14294955>> రోడ్డు ప్రమాదంలో<<>> చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా బాషా (కుడి) TGRTCలో అసిస్టెంట్ మెకానిక్గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.
News October 7, 2024
HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం
భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.
News October 7, 2024
HYD: నగరంలో ఇక కొత్త టెక్నాలజీతో సమస్యలకు చెక్
HYD అమీర్పేట్ ప్రధాన రహదారి శ్రీనగర్ కాలనీ ఆటో స్టాండ్ వద్ద సీవరేజి ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ట్రెంచ్ లెస్ సాంకేతికతను అమలు చేయనుంది. మెట్రో పనుల సమయంలో సీవరేజి అలైన్మెంట్ దెబ్బతినడంతో మురుగు సెల్లార్లలోకి చేరుతోంది. ప్రధాన రహదారిపై తవ్వకాలు చేయడానికి అనుమతి లేని కారణంగా, ఈ సాంకేతికతతో సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. త్వరలో మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు.