News May 13, 2024
BREAKING: HYD: పోలింగ్ కేంద్రంలో మహిళ మృతి!
HYD ఉప్పల్ భరత్ నగర్ ప్రాంతానికి చెందిన గట్టు విజయలక్ష్మి స్థానిక ఆంధ్ర యువత మండలి ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ స్టేషన్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే పోలింగ్ సిబ్బంది ఆమెను అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరీక్షించగా గుండెపోటుతో మరణించినట్లుగా నిర్ధారించారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 7, 2024
HYD: యాక్సిడెంట్లో చనిపోయింది వీరే..!
HYD బాలాపూర్ పరిధి మీర్పేట్ PS పరిధిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరి వివరాలు పోలీసులు తెలిపారు. షేక్ మదీనా (కుడి) బాషాTGRTCలో అసిస్టెంట్ మెకానిక్గా పని చేస్తున్నాడు. అన్నోజు శ్రావణ కుమార చారి (ఎడమ) TKR కాలేజ్లో సెక్యూరిటీ గార్డ్గా పని చేస్తున్నాడు. మదీనా బాషా TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రావణ లిఫ్ట్ అడిగాడు. వీరి మరణవార్తతో కుటుంబపెద్దలను కోల్పోయామని వారు రోదిస్తున్నారు.
News October 7, 2024
HYDలో కోటికి చేరనున్న వాహనాల సంఖ్య!
HYDలో రాబోయే పదేళ్లలో వాహనాల సంఖ్య కోటి దాటనుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఆ స్థాయిలో రోడ్లు విస్తరణకు, నిర్మాణానికి నోచుకోక, ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిటీకి’ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నడుంబిగించారు. ట్రాఫిక్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.
News October 7, 2024
లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజుజూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శ్రీ లలితా దేవిగా రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని లలిత సహస్రనామాలు పటిస్తున్నారు. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.