News September 7, 2024
BREAKING: HYD: బాలుడి దారుణ హత్య

బాలుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేసిన ఘటన HYD శివారు షాద్నగర్ పరిధి హాజిపల్లి రోడ్డు సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సాయమ్మ, దుర్గయ్య దంపతులకు కట్టప్ప(6) కుమారుడు. ఎల్లయ్య అనే వ్యక్తి రాత్రి దుర్గయ్యకు చెందిన పందులను దొంగిలించేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని బాలుడు కట్టప్ప గమనించడంతో ఎవరికైనా చెబుతాడేమోనని భావించి బాలుడిని బండకేసి బాదడంతో మృతిచెందాడు.
Similar News
News October 14, 2025
జూబ్లీహిల్స్లో 1,500 నామినేషన్లు వేసేందుకు READY

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్కు గట్టి దెబ్బ తగలనుంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెసోళ్లు నిత్యం KCRను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా 1,000 మంది నిరుద్యోగులు, 300 మంది మాలలు, 200 మంది RRR రైతులు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్కు ఓటమి సురుకు తగిలితేనే పని చేస్తుందని, లేదంటే ఐదేళ్లు ఇలానే కాలయాపన చేస్తుందని వారు పేర్కొన్నారు.
News October 14, 2025
జూబ్లీహిల్స్లో దొంగ ఓట్ల ఆరోపణలపై ఎన్నికల అధికారి ప్రకటన

కొన్ని మీడియాలు, సోషల్ మీడియా వేదికల్లో జూబ్లీహిల్స్లోని కొన్ని ఇళ్లల్లో కావాలనే దొంగ, కొత్త ఓటర్లు చేర్చారన్న వార్తలను ఎన్నికల అధికారులు ఖండించారు. విచారణలో ఆ చిరునామాల్లోని ఓటర్లు ఇప్పటికే 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎన్నికల తుది జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. కొత్తగా ఎవరూ నమోదు కాలేదని, కొన్ని ఇళ్లు భవనాలు కావడం వల్ల ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.
News October 14, 2025
FLASH: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తనిఖీల్లో రూ.25 లక్షలు పట్టివేత

HYD జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) అమీర్పేట్ మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద సారధి స్టూడియో సమీపంలో ఓ కారును తనిఖీ చేసింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంది. జైరాం తలాసియా అనే వ్యక్తి కారులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న రూ.25 లక్షల నగదును అధికారులు సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం మధురానగర్ PS SHO ప్రభాకర్కు అప్పగించారు.