News June 4, 2024
BREAKING: HYD: కార్పొరేటర్ మృతి

HYD ఎర్రగడ్డ కార్పొరేటర్, MIM మహిళా నేత షాహిన్ బేగం ఈరోజు మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో ఎర్రగడ్డ నుంచి MIM పార్టీ తరఫున ఆమె గెలిచారు. ఆమె మృతికి పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.
Similar News
News September 15, 2025
HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్మెట్ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.
News September 15, 2025
HYD: గొర్రెల స్కామ్ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.
News September 15, 2025
హైదరాబాద్కు ‘మోక్షం’ ప్రసాదించారు

1908..HYD మరిచిపోలేని ఏడాది. మూసీలో భారీ వరదలు వేలమందిని బలిగొన్నాయి. మరోసారి పునరావృతం కాకుండా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1909లో ద్విముఖ వ్యూహం రచించారు. అదే మూసీ ప్రాజెక్ట్. వరదల నియంత్రణ, తాగునీటి కష్టాలు తీర్చేలా ట్వీన్ రిజర్వాయర్స్ ఆయన ఆలోచనల నుంచే పుట్టాయి. టెక్నాలజీ పెద్దగా లేనప్పుడే నేటికి చెక్కుచెదరని పటిష్ఠ డ్రైనేజీ వ్యవస్థ HYDకు అందించారు. నేడు ఆ మహాజ్ఞాని జయంతి సందర్భంగా స్మరించుకుందాం.