News February 11, 2025
BREAKING: HYD: కూకట్పల్లిలో భార్యను చంపిన భర్త
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270658432_718-normal-WIFI.webp)
HYD కూకట్పల్లిలో PS పరిధిలో ఈరోజు దారుణం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక రాజీవ్ గాంధీ నగర్లో నివాసం ఉంటున్న అబ్దుల్ రహీం అనే వ్యక్తి తన భార్య నసీమా బేగంను బండ రాయితో మోది దారుణంగా చంపేశాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇంట్లోనే ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2025
HYD: వేధింపులకు గురిచేస్తున్నారా..ఈ నెంబర్లకు ఫోన్ చేయండి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739280572774_52250039-normal-WIFI.webp)
మహిళలు, యువతులు వేధింపులకు గురి అయితే ధైర్యంగా షీ టీమ్ని సంప్రదించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. రాచకొండ వాట్సాప్ నంబర్ 8712662111 ద్వారా లేదా మీ ప్రాంత షీ టీమ్ అధికారుల నంబర్లు: ఇబ్రహీంపట్నం 8712662600, కుషాయిగూడ 8712662601, ఎల్బీనగర్ 8712662602, మల్కాజ్గిరి 8712662603, వనస్థలిపురం 8712662604, నంబర్లకు వాట్సాప్ ద్వారా నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.
News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739283481544_718-normal-WIFI.webp)
మధ్యప్రదేశ్ జబల్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2025
HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739282241272_718-normal-WIFI.webp)
ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.