News May 22, 2024
BREAKING.. HYD: నడిరోడ్డు పై మద్యం వాహనం బోల్తా

సికింద్రాబాద్ బోయినపల్లిలో మద్యం లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. టైర్ పంక్చర్ కావడంతో డివైడర్ను ఢీకొట్టి వాహనం బోల్తా పడి దాదాపు రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయినట్లు సమాచారం. రోడ్డుపై మద్యం సీసాలు పడడంతో వాహనదారులు వాటిని పట్టుకెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2025
ఖైరతాబాద్: ‘ఈ నెల 24న బీసీ బతుకమ్మ నిర్వహిస్తాం’

ఈ నెల 24న ట్యాంక్ బండ్పై బీసీ బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వేలాది మంది మహిళలు బీసీ బతుకమ్మ వేడుకలో పాలుపంచుకుంటారన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరారు.
News September 14, 2025
HYD: ఈ ఫార్ములా కేస్.. విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి బాల్

గత ప్రభుత్వం HYDలో నిర్వహించిన ఈ ఫార్ములా కార్ రేసులో భారీ అవినీతి జరిగిందని అవినీతి నిరోధక శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి తదుపరి విచారణకు అనుమతివ్వాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ రిపోర్టును విజిలెన్స్ కమిషన్కు పంపి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయం కోరింది. విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ కేసుపై చర్యలు తీసుకోనుంది.
News September 14, 2025
చిన్నారుల జీవితాల్లో ఆశలు కల్పిస్తున్న నిమ్స్

గుండె సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు నిమ్స్లో నేటి నుంచి ఆపరేషన్లు నిర్వహించనున్నారు. బ్రిటన్ వైద్యులు ఏటా సెప్టెంబరులో ఈ చికిత్సలు చేస్తారు. ఈనెల 20వ తేదీ వరకు క్లిష్టమైన ఆపరేషన్లను చేస్తారు. నిమ్స్ కార్డియోథొరాసిక్ డాక్టర్ల సహకారంతో ఈ వైద్యం అందించనున్నారని కార్డియోథొరాసిక్ హెడ్ డా.అమరేశ్వర్ రావు తెలిపారు.