News October 26, 2024
BREAKING: కష్టాల్లో భారత్
న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 359 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్(8) వికెట్ త్వరగానే కోల్పోగా, గిల్(23), జైశ్వాల్(77) జోడీ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ కాగా, ఆ కాసేపటికే పంత్(0) కూడా రనౌట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ(14), సుందర్(3) ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 225 రన్స్ చేయాలి.
Similar News
News October 26, 2024
కావాలనే HYDపై విషప్రచారం: భట్టి
TG: హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధిపై కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. మంచినీటి సమస్య లేకుండా గోదావరి, కృష్ణ, మంజీరా నదుల నుంచి తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల JAC నేతలతో భట్టి సమావేశం ముగిసింది. ఇవాళ కనీసం ఒక డీఏ అయినా ప్రకటించే ప్రయత్నం చేస్తామన్నారు.
News October 26, 2024
ఇరాన్పై దాడి: జాగ్రత్తపడిన ఇజ్రాయెల్!
ఇరాన్పై జరిపిన ప్రతీకార దాడి అంతర్జాతీయ సంఘర్షణలకు దారి తీయకుండా ఇజ్రాయెల్ జాగ్రత్తపడినట్టు తెలుస్తోంది. ఇరాన్కు చెందిన 20 వైమానిక స్థావరాలనే టార్గెట్ చేసింది. అక్కడి న్యూక్లియర్ ప్లాంట్లు, Oil రిఫైనరీలను టచ్ చేయలేదు. సార్వభౌమాధికారం గల దేశంపై దాడి చేస్తే ప్రతిదాడి తమ హక్కు అని నిరూపించడానికే Precise Strikes జరిపింది. దాడికి 100 F-35Adir, F-15I Ra’am, F-16I Sufa జెట్లను వాడింది.
News October 26, 2024
డెమోక్రాట్లను టెన్షన్ పెడుతున్న మిచిగాన్
7 స్వింగ్ స్టేట్స్లో ఒకటైన మిచిగాన్ డెమోక్రాట్లను టెన్షన్ పెడుతోంది. ఇక్కడ దాదాపు 4 లక్షల వరకు ఉన్న అరబ్ అమెరికన్స్ మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులను బైడెన్ నియంత్రించలేకపోయారని అసంతృప్తితో ఉన్నారు. 2020 ఎన్నికల్లో బైడెన్కు పట్టం కట్టిన మిచిగాన్ ఈ సారి బైడెన్, అయన విధానాలను వ్యతిరేకించని కమలపై గుర్రుగా ఉన్నారు. దీంతో మిచిగాన్ డెమోక్రాట్లను టెన్షన్ పెడుతోంది.