News October 20, 2024
BREAKING: భారత్ పరాజయం
న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచులో భారత్ పరాజయం పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన NZ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. యంగ్(45*), రవీంద్ర(39*) జట్టును విజయతీరాలకు చేర్చారు. భారత బౌలర్ బుమ్రా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే ఆలౌటవ్వగా, రెండో ఇన్నింగ్సులో 462 పరుగులు చేసింది. మరోవైపు NZ తొలి ఇన్నింగ్సులో 402 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 20, 2024
రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు
న్యూజిలాండ్తో తొలి టెస్టులో టీమ్ఇండియా ఓటమికి రోహిత్ శర్మ కెప్టెన్సీనే కారణమని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. పిచ్ను ఆయన సరిగా అంచనా వేయలేదని, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని పొరపాటు చేశారని అంటున్నారు. NZ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలోనూ బౌలర్లను సరిగా వినియోగించుకోలేదని, అశ్విన్కు చివర్లో బౌలింగ్ ఇచ్చారని పేర్కొంటున్నారు. ‘CLUELESS CAPTAIN ROHIT’ అని Xలో ట్రెండ్ చేస్తున్నారు.
News October 20, 2024
ఢిల్లీ ఒకప్పటి ముంబైలా తయారైంది: ఢిల్లీ సీఎం
రోహిణి ప్రాంతంలోని స్కూల్ బయట బాంబు పేలుడు జరగడంపై ఢిల్లీ సీఎం ఆతిశీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నగరం పరిస్థితి 90వ దశకంలో ముంబైలా తయారైంది. ఇక్కడి శాంతి భద్రతలు కేంద్రం చేతిలోనే ఉన్నాయి. కానీ ఆ పని వదిలేసి మా ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై దృష్టి పెడుతోంది. సిటీలో ఇష్టానుసారం తూటాలు పేలుతున్నాయి. బ్లాక్మెయిల్స్, నేరాలు ఘోరంగా పెరిగిపోయాయి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
News October 20, 2024
MH: MLA అభ్యర్థుల జాబితా విడుదల చేసిన BJP
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేేసే అభ్యర్థుల జాబితాను BJP విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా 99 మందితో ఫస్ట్ లిస్టును రిలీజ్ చేసింది. ఆ పార్టీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగ్పూర్ సౌత్ వెస్ట్ నుంచి బరిలో నిలిచారు. కాగా నవంబర్ 20న పోలింగ్ జరగాల్సి ఉంది.