News March 24, 2024

జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారంగా ప్రకటించింది. నెల్లిమర్ల-లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీ, తెనాలి-నాదెండ్ల మనోహర్, నిడదవోలు-కందుల దుర్గేష్, పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం-గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు.

Similar News

News December 30, 2025

మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రసాద్.. 2004లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

News December 30, 2025

Money Tip: ఆపదలో ఆదుకునే ‘ఎమర్జెన్సీ ఫండ్’

image

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సడన్‌గా ఉద్యోగం పోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చినా చేతిలో డబ్బు లేకపోతే చాలా కష్టం. అందుకే ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఉండాలి. మీ నెలవారీ ఖర్చులు ఎంతవుతాయో లెక్కేయండి. దానికి కనీసం 6 రెట్లు అమౌంట్ ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఉదాహరణకు మీ ఖర్చు ₹25 వేలు అయితే ₹లక్షన్నర విడిగా ఉండాలి. ఈ డబ్బును వెంటనే చేతికి అందేలా ఇన్వెస్ట్ చేయడం బెస్ట్.

News December 30, 2025

గ్రూప్‌-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత

image

AP: గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ పాటించాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.