News March 24, 2024
జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారంగా ప్రకటించింది. నెల్లిమర్ల-లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీ, తెనాలి-నాదెండ్ల మనోహర్, నిడదవోలు-కందుల దుర్గేష్, పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం-గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు.
Similar News
News December 29, 2025
ఈనెల 30న కలెక్టరేట్లో వర్క్ షాప్: జేసీ

నూతన ఆవిష్కరణల ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లను బలోపేతం చేసేందుకు ఈనెల 30న బొమ్మూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు జేసీ మేఘా స్వరూప్ తెలిపారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NRDC), RTIH సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ వంటి కీలక అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని జేసీ పేర్కొన్నారు.
News December 29, 2025
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.710 తగ్గి రూ.1,41,710కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి రూ.650 తగ్గి రూ.1,29,900 పలుకుతోంది. అటు కొద్ది రోజులుగా విపరీతంగా పెరిగిన వెండి ధరలు ఇవాళ దిగివచ్చాయి. కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,81,000 పలుకుతోంది.
News December 29, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ గడ్డి పెంపకం

చాలా మంది రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని జీవాలకు ఇస్తున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. దీన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది.


