News March 24, 2024
జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారంగా ప్రకటించింది. నెల్లిమర్ల-లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీ, తెనాలి-నాదెండ్ల మనోహర్, నిడదవోలు-కందుల దుర్గేష్, పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం-గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు.
Similar News
News December 19, 2025
ఐ మేకప్ వేసుకొనే ముందు

కాజల్, మస్కారా, ఐలైనర్, ఐషాడోలను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు, ఇది ఎక్కువసేపు కళ్ళ పైన ఉండటం వల్ల వాటిలోని రసాయనాలు, ప్రిజర్వేటివ్లు కళ్ళ మెరుపును తగ్గిస్తాయంటున్నారు. అలాగే ఐ మేకప్ ప్రొడక్ట్స్ వాడే ముందు చేతులు శుభ్రం చేసుకోవడం, వాటిని ఇతరులతో పంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముందంటున్నారు.
News December 19, 2025
పూర్వోదయ, సాస్కీ పథకాలతో చేయూత ఇవ్వండి: సీఎం

AP: ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని వినతి పత్రం అందజేశారు. కేంద్ర పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులను విడుదల చేయాలని విన్నవించారు.
News December 19, 2025
భార్యను చంపి 72 ముక్కలు.. హైకోర్టు తీర్పు ఇదే

డెహ్రాడూన్లో భార్యను చంపి 72 ముక్కలుగా నరికేసిన సంచలన కేసులో ఉత్తరాఖండ్ హైకోర్టు దోషి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. నిందితుడు రాజేశ్ గులాటికి జీవిత ఖైదు, రూ.15 లక్షల ఫైన్ విధిస్తూ డెహ్రాడూన్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కాగా రాజేశ్-అనుపమలకు 1999లో వివాహం జరిగింది. మనస్పర్ధలతో 2010 OCT 17న భార్యను చంపి ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచేయగా అదే ఏడాది DEC 12న విషయం బయటికొచ్చింది.


