News April 25, 2024

BREAKING: జేఈఈ మెయిన్-2 ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. <>https://jeemain.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే జనవరిలో జరిగిన తొలి సెషన్‌తోపాటు ఏప్రిల్‌లో నిర్వహించిన రెండో సెషన్‌లో మెరుగైన స్కోరు సాధించిన వారి మెరిట్ లిస్టును విడుదల చేసింది. దేశంలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది.

Similar News

News December 8, 2025

900 మంది పైలట్లను తీసుకోనున్న ఇండిగో!

image

సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా పైలట్లను నియమించుకోవడంపై ఇండిగో దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10కి 158 మంది, 2026 Dec కల్లా 742 మందిని తీసుకుంటామని ప్రభుత్వానికి సంస్థ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ‘ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తోంది. మరో 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ ఆఫీసర్ల నియామకం/అప్‌గ్రేడ్ చేయనుంది’ అని తెలిపింది. కాగా ఇండిగోకు 5,456 మంది పైలట్లు ఉన్నారు.

News December 8, 2025

2026 DECకు పూర్తి కానున్న విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే

image

విశాఖపట్నం-రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) ఎక్స్‌ప్రెస్‌వే పనులు 2026 చివరి నాటికి పూర్తి కానున్నాయి. రూ.16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆర్థిక కారిడార్‌ను కేంద్రం చేపట్టింది. మొత్తం 597 KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తోంది. దీంతో AP, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 7 గంటలు తగ్గుతుంది. టూరిజం, పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు పెద్ద ఊతం లభించనుంది.

News December 8, 2025

పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.