News March 12, 2025

BREAKING: KCRను కలిసిన పటాన్‌చెరు MLA

image

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం ఈరోజు జరిగింది. అసెంబ్లీకి వచ్చిన BRS అధినేత KCRను పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికార్డును KCRకు ఇచ్చి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం ఆయన BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన KCRను కలవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.

Similar News

News February 9, 2026

చిత్తూరు: ‘డ్రోన్ కెమెరా నుంచి తప్పించుకోలేరు’

image

కార్వేటినగరం పోలీసులు డ్రోన్ కెమెరా నిఘాతో మండలంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సెకండ్ల వ్యవధిలో పట్టేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సోమవారం సీఐ హనుమంతప్ప ఎస్ఐ తేజశ్వినితో కలిసి ధైర్యస్పర్శ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రోన్ కెమెరా నిఘా పర్యవేక్షణలో మందుబాబులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పట్టుబడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 9, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్‌తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

News February 9, 2026

లవ్ ఫెయిల్యూర్స్‌తో పెరిగిన సూసైడ్స్: అనిత

image

AP: ఇటీవలి కాలంలో ప్రేమలు విఫలమవ్వడంతోనే అధికంగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని హోంమంత్రి అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ‘కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలతోనూ ఆత్మహత్యలు పెరిగాయి. వీటిపై ఉన్నత స్థాయిలో అధ్యయనం చేసి మరణాలు అరికట్టాలి. ప్రభుత్వ అవగాహనతో లోన్ యాప్ ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రంలో గంజాయి సాగు జీరో పర్సెంట్ వచ్చింది’అని ఆమె వెల్లడించారు.