News October 25, 2024
BREAKING: పోలీసు శాఖ కీలక నిర్ణయం
TG: రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల విధానంపై ఇటీవల ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు ఐదేళ్లు ఒకే చోట పోస్టింగ్, ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం తీసుకురావాలని కానిస్టేబుళ్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News October 25, 2024
గ్రూప్-1 ఎగ్జామ్: చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి..
TG: గ్రూప్-1 పరీక్షలో ఓ మహిళా అభ్యర్థి కాపీ కొడుతూ పట్టుబడింది. మహబూబ్నగర్ జిల్లా ఖానాపూర్కు చెందిన మహిళ రంగారెడ్డి జిల్లాలోని సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఇవాళ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్షకు హాజరైంది. ఈక్రమంలోనే చీరకొంగులో చీటీలు పెట్టుకొచ్చి, కాపీయింగ్ కొడుతుండగా ఇన్విజిలేటర్ గుర్తించారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
News October 25, 2024
ఎన్టీఆర్కు సభ్యత్వమైనా ఇచ్చావా బాబూ: పేర్ని
AP: షర్మిలను జగన్ మోసం చేశారన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ‘జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు ఎంతగానో ఉపయోగించుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటికీ టీడీపీ సభ్యత్వం ఇవ్వలేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావునూ అలాగే మోసం చేశారు. హెరిటేజ్లో ఆయన తోబుట్టువులకు ఏమైనా వాటాలు ఇచ్చారా? జగన్ ఇంట్లో చిచ్చు పెట్టి చంద్రబాబు చలి కాచుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు.
News October 25, 2024
ఎన్నికల ప్రచారంలో ధోనీ!
మిస్టర్ కూల్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ MS ధోనీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఝార్ఖండ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఓటర్లకు అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. ఈసీ విజ్ఞప్తి మేరకు వీడియోను ఎన్నికల కమిషన్కు అందించారని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఓటింగ్ పర్సెంటేజ్ను పెంచేందుకు ఈసీ ఈ ప్రచారం చేయించనుందని సమాచారం. రాష్ట్రంలో NOV 13, 20 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.