News July 11, 2024

BREAKING.. KNR: ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ప్రయాణికుడు మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సులో ఫిట్స్‌తో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. ఈ ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటుచేసుకుంది. KNR నుంచి గంగాధరకు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న రాజయ్యకు ఫిట్స్ వచ్చింది. దీంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకునే సరికి మృతిచెందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 7, 2024

వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

image

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించుకుని సేవలో తరించారు. కోడె మొక్కులు చెల్లించుకుని అందరినీ చల్లగా చూడు స్వామి అంటూ వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఈ లైన్లో దర్శనార్థం భక్తులు వేచి చూశారు.

News October 7, 2024

కరీంనగర్: గునుగు పూలకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక కాళిదాసు ఆదివారం ఉదయం గునుగు పూలు తేవడానికి వెళ్లాడు. పూలను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా సోమవారం మృతదేహాన్ని వెలికి తీశారు.

News October 7, 2024

కరీంనగర్: గ్రామాల్లో మొదలైన ‘పంచాయతీ’ సందడి!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావహులు అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అధికారులు ఓటరు తుది జాబితాను విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. దీంతో పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. కాగా జగిత్యాలలో 382 గ్రామ పంచాయతీలు అలాగే సిరిసిల్ల-255, కరీంనగర్-323, పెద్దపల్లి జిల్లాలో 266 పంచాయతీలు ఉన్నాయి.