News July 24, 2024
BREAKING: అన్న భార్య, పిల్లలను చంపి వ్యక్తి సూసైడ్

AP: తిరుపతిలో దారుణం జరిగింది. పద్మావతి వర్సిటీ సమీపంలోని మునిరెడ్డి నగర్లో ఓ వ్యక్తి ముగ్గురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ తగాదాలతో మోహన్ అనే వ్యక్తి తన వదిన సునీత, ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజను కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతడు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
మహిళల కోసం ఇన్ఫోసిస్ కొత్త ప్రోగ్రామ్

కనీసం 6 నెలల కెరీర్ గ్యాప్ వచ్చిన మహిళా నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు ఇన్ఫోసిన్ ముందుకొచ్చింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇనిషేటివ్’ పేరుతో గత నెల కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులైన మహిళలను రిఫర్ చేయొచ్చు. వారు జాబ్కు ఎంపికైతే లెవెల్-3లో రూ.10వేలు, లెవెల్-4లో రూ.25వేలు, లెవెల్-5లో రూ.35వేలు, లెవెల్ 6లో రూ.50వేల వరకు రివార్డులు అందించనుంది.
News October 17, 2025
646 పోస్టులు.. దరఖాస్తుకు 3రోజులే సమయం

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో 646 పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3రోజులే (OCT 20) సమయం ఉంది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీహెచ్డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.cdac.in
News October 17, 2025
షోడశోపచార పూజతో శివపథం

పరమశివుని అనుగ్రహం పొందడానికి శివ లింగానికి షోడశోపచార పూజ చేయడం అత్యుత్తమని శివ మహాపురాణం చెబుతోంది. ఆవాహనం నుంచి ఉద్వాసన వరకు 16 భక్తియుక్త సేవలతో స్వామిని ఆరాధించాలి. ఈ ప్రక్రియ సాధ్యం కాకపోతే.. పవిత్రమైన అభిషేకం, ప్రేమపూర్వక నైవేద్యం, భక్తితో నమస్కారాలు చేసినా సరిపోతుంది. ఈ ఆరాధనలు భక్తులను తరింపజేస్తాయి. పరమ శివుని దివ్యలోకమైన ‘శివపథాన్ని’ అందిస్తాయి. ఈ సేవలే ముక్తికి మార్గాలు. <<-se>>#SIVOHAM<<>>