News April 2, 2024
BREAKING: MDK: రఘునందన్రావుపై FIR నమోదు
మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావుపై సంగారెడ్డి పట్టణ పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు.
Similar News
News October 6, 2024
MDK: గ్రంథాలయ సంస్థలకు నూతన ఛైర్మన్లు
తెలంగాణలో బతుకమ్మ పండుగకు ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా గ్రంథాలయ బోర్డు ఛైర్పర్సన్గా చిలుముల సుహాసిని రెడ్డి, సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ బోర్డ్ ఛైర్మన్గా గొల్ల అంజయ్యను నియమించింది.
News October 6, 2024
సంగారెడ్డి: రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధులు
సంగారెడ్డి జిల్లాలోని రైతులకు 18వ విడత పీఎం కిసాన్ నిధులు రైతులకు సంబంధించిన ఖాతాలలో జమ అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిధులను వ్యవసాయ పనులకు వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా రైతులు నిధులు జమ కావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
News October 6, 2024
దసరాకు ముస్తాబైన జ్వాలాముఖి ఆలయం
కంగ్టి మండలంఎడ్ల రేగడి తండాలోని జ్వాలాముఖి ఆలయాన్ని దసరా పండుగకు ముస్తాబు చేసినట్టు ఆలయ ప్రధాన పూజారి శ్రీ మంగళ్ చంద్ మహారాజ్ తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొంటారని పేర్కొన్నారు. మంగళవారం జ్వాలాముఖి దేవికి హోమం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.