News August 2, 2024

BREAKING: MDK: 9వ తరగతి బాలిక ఆత్మహత్య

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్‌లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 19, 2025

తూప్రాన్: తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు మెంబర్

image

తూప్రాన్ మండలంలో తమ్ముడు సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. అక్క మనోహరాబాద్ మండలంలో వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎంజాల స్వామి సర్పంచిగా ఎన్నికయ్యారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామపంచాయతీలో స్వామి అక్క కనిగిరి అనసూయ వార్డు సభ్యురాలుగా పోటీ చేసి గెలుపొందారు. తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

News December 19, 2025

MDK: సతులు సర్పంచ్‌లు.. పతులు వార్డ్ మెంబర్‌లు

image

నర్సాపూర్ మం. ఆవంచ, కాగజ్ మద్దూర్‌లో సర్పంచులుగా సతీమణులను గెలిపించుకొని, భర్తలు వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఆవంచలో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొంది, భర్త కర్ణాకర్ (Ex.సర్పంచ్) వార్డ్ సభ్యుడిగా గెలుపొందారు. కాగజ్ మద్దూర్లో విజయ సర్పంచ్‌గా గెలుపొంది, భర్త శివకుమార్ (Ex.సర్పంచ్) వార్డు సభ్యుడిగా గెలుపొందారు. వారు మాజీ సర్పంచ్‌లుగా కొనసాగి గ్రామానికి సేవలు అందించిన మళ్లీ గ్రామస్థులు పట్టం కట్టారు.

News December 18, 2025

మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.