News October 2, 2024

రైల్వేట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

image

ఝార్ఖండ్‌లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్‌పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 5, 2026

పశువుల పాలను సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

image

పశువుల పాలను తీసే సమయంలో డెయిరీఫామ్ నిర్వహించేవారు, పాడి రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి పాలను సేకరించాలని, పొదుగు నుంచి పాలను పూర్తిగా తీయకుండా వదిలేయడం మంచిది కాదంటున్నారు. మిల్క్ సేకరించిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాలకు మంచి ధర ఎప్పుడు లభిస్తుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News February 5, 2026

ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పోస్టులు

image

<>ఢిల్లీలోని<<>> ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PhD, MSc(ప్లాంట్ పాథాలజీ/వైరాలజీ/మాలిక్యులార్ బయాలజీ/బయో టెక్నాలజీ/బయో ఇన్ఫర్మాటిక్స్), డిగ్రీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/

News February 5, 2026

పాలు పితికేటప్పుడు ఇవి గమనించాలి

image

రోజూ ఒకే సమయంలో పాలు పితకాలి. ఈ సమయంలో పశువు బెదరకుండా, చిరాకు పడకుండా చూడాలి. పాల ఉత్పత్తికి అవసరమయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోను మెదడు నుంచి విడుదలై రక్తప్రసరణలో 8 నిమిషాలే ఉంటుంది. అందుకే పాలను 5-8 నిమిషాల లోపే తీయాలి. దీని వల్ల పాలలో అధిక వెన్నశాతం పొందొచ్చు. పాల తొలి ధారల్ని దూడలకు తాగించి, మలి ధారలను కేంద్రానికి పోయాలి. వీటిలో సుమారు 10% వెన్న ఉంటుంది. వీటిని దూడకు తాగించడం మంచిది కాదు.