News October 22, 2024
BREAKING.. MLA గంగుల కమలాకర్కు మాతృవియోగం

మాజీ మంత్రి, కరీంనగర్ MLA గంగుల కమలాకర్ తల్లి గంగుల నర్సవ్వ సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు. కరీంనగర్లోని గంగుల ఇంట్లో భౌతిక కాయాన్ని కరీంనగర్ పట్టణ, మండల నాయకులు, ప్రజలు సందర్శించి, MLA కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గంగుల కమలాకర్కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్లో దహన సంస్కారాలు చేయనున్నారు.
Similar News
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో తొలి ఫలితాన్ని ప్రకటించిన అధికారులు

ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక్క వార్డుకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు పూర్తికావడంతో విజేతను ప్రకటించి, జిల్లాలోనే తొలి ఫలితంగా నిలిపారు. సర్పంచ్ స్థానం ఇదివరకే ఏకగ్రీవం కాగా, ఇప్పుడు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో ఉపసర్పంచ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
News December 17, 2025
కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.
News December 17, 2025
కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్లో 8.14% పోలింగ్ నమోదైంది.


