News February 24, 2025

BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉండనుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమలనాయుడు, రామారావు, తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి, సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.

Similar News

News December 14, 2025

VKBలో 78.31 శాతం పోలింగ్ నమోదు

image

వికారాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఒంటి గంట వరకు 78.31 పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వికారాబాద్ డివిజన్‌లో ఏడు మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్‌లో 1 గంటల వరకు 78.31 పోలింగ్ నమోదు కాగా 2,09,847 మంది ఓటర్లకు 1,64,330 మంది ఓటర్లు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అక్కడ ఓటు వేసేందుకు క్యూ లైన్‌లో ఓటర్లు ఉన్నారు. పూర్తి వివరాలు తరువాత వెల్లడించనున్నారు.

News December 14, 2025

ఈమె ఎంతో మందికి స్ఫూర్తి

image

TG: ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి ఓటర్లలో చైతన్యం నింపారు. అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్నా ఎంతోమంది ఓటేయడానికి ఆసక్తి చూపరు. కానీ, రామాయంపేట పరిధి కల్వకుంటలో అంగవైకల్యమున్నా ఆమె పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేశారు. తండ్రి ఆమెను భుజాలపై మోసుకుని తీసుకెళ్లి ఓటు వేయించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

News December 14, 2025

54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్

image

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ/ బీటెక్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. GATE-2025 స్కోరు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.56,100-రూ.1,77,500 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.300. వెబ్‌సైట్: https://www.dvc.gov.in