News April 12, 2024

BREAKING: సీబీఐ కస్టడీకి MLC కవిత

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. CBI అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ రేపటి నుంచి ఈ నెల 15 వరకు తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. ఇప్పటికే ఆమెను పలు అంశాలపై ఈడీ విచారించగా.. సీబీఐ కూడా మరికొన్ని అంశాలపై ప్రశ్నించనుంది.

Similar News

News March 10, 2026

హోటళ్లే కాదు.. హాస్టళ్లలోనూ ఇబ్బందులే!

image

కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో హోటల్ రంగం సంక్షోభంలో పడింది. గ్యాస్ లేక బెంగళూరు, చెన్నైలలో ఇప్పటికే అనేక <<19341968>>హోటళ్లు<<>> మూతపడ్డాయి. ఇదే సెగ హైదరాబాద్‌కు తాకే ప్రమాదం ఉంది. హాస్టళ్లలోనూ వంట నిలిచిపోతే వేలాది విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందిపడనున్నారు. బయట హోటళ్లు కూడా క్లోజ్ అయితే తిండి కష్టాలు తప్పవని నెటిజన్లు వాపోతున్నారు. ప్రభుత్వం గ్యాస్ కొరతను తీర్చాలని వారు కోరుతున్నారు.

News March 10, 2026

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 639 పాయింట్లు ఎగిసి 78,205కు చేరగా, నిఫ్టీ 233 పాయింట్ల లాభంతో 24,261 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ 30లో మహీంద్రా & మహీంద్రా (+3.67%), ఇండిగో (+3.21%), ఏషియన్ పెయింట్స్ (+3.13%), మారుతీ (+2.94%) టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, ఆసియా మార్కెట్లు కోలుకోవడం, రూపాయి విలువ మళ్లీ బలపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.

News March 10, 2026

డ్రోన్ వ్యాపారంలోకి ట్రంప్ కుమారులు

image

US-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ట్రంప్ కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్ డ్రోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. మిలిటరీ అవసరాల కోసం అటానమస్ డ్రోన్లను తయారు చేసే ‘పవరస్’ సంస్థలో వీరు పెట్టుబడులు పెట్టారు. ఒకవైపు తండ్రి యుద్ధానికి ఆదేశాలిస్తుంటే మరోవైపు కుమారులు దానికి అవసరమైన ఆయుధాల వ్యాపారంలోకి ప్రవేశించడం ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’ అవుతుందని నిపుణులు విమర్శిస్తున్నారు.