News March 25, 2025

BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

image

TG: రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ 3 నుంచి 4 ఎకరాల్లోపు అన్నదాతల ఖాతాల్లో రూ.200 కోట్ల డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు రిలీజ్ చేసినట్లయ్యింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4,666.57 కోట్లు అందించింది. ఈ నెలాఖరులోపు రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News November 17, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

image

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్‌ను HYDలో అరెస్ట్ చేశారు.

News November 17, 2025

ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

image

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్‌ను శ్రీనగర్‌లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్‌ను HYDలో అరెస్ట్ చేశారు.

News November 17, 2025

ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

image

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్‌ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్‌వర్క్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.