News February 27, 2025

ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

image

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.

Similar News

News January 20, 2026

మున్సిపాలిటీల్లో చీరల పంపిణీ ప్రారంభం

image

TG: మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. తొలి దశలో 67 మున్సిపాలిటీలలో 5 లక్షల చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రెండో దశలో మున్సిపల్ ఎన్నికలకు ముందు 60 మున్సిపాలిటీల్లో పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో కోటి చీరల పంపణీ లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు పంపిణీ చేసింది.

News January 20, 2026

మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌లో పోస్టులు

image

<>ONGC<<>>కి చెందిన మంగళూరు రిఫైనరీ & పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌‌లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్) అర్హత గల అభ్యర్థులు NATS 2.0 పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. జనవరి 22న అప్రెంటిస్ ఫెయిర్ నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://admin.mrpl.co.in

News January 20, 2026

ఉల్లిలో ఊదారంగు మచ్చ తెగులు – నివారణకు సూచనలు

image

ఉల్లి పంటలో కనిపించే తెగుళ్లలో ఉదారంగు మచ్చ తెగులు ఒకటి. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు ప్రధాన పొలంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీని నివారణకు రైతులు ముందుగానే లీటరు నీటికి కార్బండజిమ్ 1గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.