News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.
Similar News
News January 4, 2026
టుడే టాప్ స్టోరీస్

* TG: నీటి వాటాలపై కేసీఆర్ సంతకం తెలంగాణకు మరణశాసనం: CM రేవంత్
* TG: తోలు తీస్తా అన్నవాళ్ల నాలుక కోస్తా: CM రేవంత్
* TG: కొండగట్టుకు పవన్.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
* AP: రేపు భోగాపురం ఎయిర్పోర్టులో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్
* గంజాయి తీసుకుంటూ దొరికిన AP BJP MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్
* వెనిజులాపై US దాడి.. అదుపులోకి అధ్యక్షుడు మదురో
* న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు భారత జట్టు ఎంపిక
News January 4, 2026
2 గంటలు అనర్గళంగా రేవంత్ ప్రసంగం

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో 2 గంటలు ఏకధాటిగా మాట్లాడారు. రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అనర్గళంగా ప్రసంగించారు. కృష్ణా జలాల కేటాయింపు, పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో BRS అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. నాటి CM KCR, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావే అంతా చేశారని ధ్వజమెత్తారు. అయితే నీళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని స్పష్టం చేశారు.
News January 4, 2026
ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.


