News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.
Similar News
News December 15, 2025
చేగుంట: 4 ఓట్ల తేడాతో గెలుపు

చేగుంట మండలం పోలంపల్లి సర్పంచిగా కొండి రాజ్యలక్ష్మి విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి రాజ్యలక్ష్మి సమీప ప్రత్యర్థి తప్ప మేనకపై 4 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
News December 15, 2025
వారిది పాకిస్థాన్.. ఐసిస్తో లింకులు!

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకులు<<>> పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. బాండీ బీచ్లో వారి కారుపై ఐసిస్ జెండాలను అధికారులు గుర్తించారు. ప్రాణాలతో పట్టుబడిన నవీద్ అక్రమ్కు ఐసిస్తో సంబంధాలున్నట్లు సమాచారం. ఆరేళ్ల కిందట అతడిపై దర్యాప్తు చేసినట్లు ఆసీస్ మీడియా తెలిపింది. నిందితుల్లో ఒకరు నిఘా రాడార్లో ఉన్నప్పటికీ, అతడి నుంచి తక్షణ ముప్పులేదని సీరియస్గా తీసుకోలేదని సమాచారం.
News December 15, 2025
సూర్యకుమార్ చెత్త రికార్డు

IND ప్లేయర్ సూర్యకుమార్ T20Iల హిస్టరీలోనే చెత్త రికార్డు నమోదు చేశారు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యల్ప యావరేజ్(14.20)తో <<18568094>>పరుగులు<<>> చేసిన కెప్టెన్గా నిలిచారు. ఇతని కంటే ముందు రువాండ కెప్టెన్ క్లింటన్ రుబాగుమ్య(12.52) ఉన్నారు. కానీ ICC టాప్-20 జట్లలో ఆ టీమ్ లేదు. అలాగే ఒక ఏడాదిలో(కనీసం 10 inngs) అత్యల్ప యావరేజ్ నమోదుచేసిన రెండో ఇండియన్ బ్యాటర్గా SKY నిలిచారు. 2022లో అక్షర్ పటేల్ యావరేజ్ 11.62గా ఉంది.


