News February 27, 2025

ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

image

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.

Similar News

News January 31, 2026

శని త్రయోదశి పూజ ఎలా చేయాలి?

image

నవగ్రహ ఆలయంలో శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పోసి మూటకట్టి దీపారాధన చేయాలి. తమలపాకులో బెల్లం ఉంచి నైవేద్యంగా సమర్పించాలి. వీలైతే రావి చెట్టుకు 9 లేదా 11 ప్రదక్షిణలు చేయాలి. పూజ అనంతరం నల్లని వస్త్రాలు, పాదరక్షలు లేదా ఆహారాన్ని దానం చేయాలి. శివార్చన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని పండితులు సూచిస్తున్నారు.

News January 31, 2026

బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే ఢమాల్

image

అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్న బంగారం ధర 11%, వెండి రేటు 32% తగ్గింది. గురువారం ఔన్స్(28.35gms) బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు $5,595(రూ.5.13L)కి చేరగా శుక్రవారం $4,722(రూ.4.32L)కి తగ్గింది. ఔన్స్ సిల్వర్ గురువారం $121.67(రూ.11,155)గా ఉండగా శుక్రవారం $79.30(రూ.7,270)కి పడిపోయింది. USD బలోపేతం, ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌గా కెవిన్ వార్ష్‌ నామినేట్, అమ్మకాలు పెరిగి కొనుగోళ్లు తగ్గడం వంటివి దీనికి కారణాలు.

News January 31, 2026

T20 WCలో ఇద్దరు స్పిన్నర్లు వద్దు: అశ్విన్

image

T20 WCలో టీమ్ ఇండియా తుది జట్టులో ఇద్దరు మెయిన్ స్పిన్నర్లను ఆడించొద్దని మాజీ క్రికెటర్ అశ్విన్ సూచించారు. ‘ఒక మెయిన్ స్పిన్నర్, ఒక స్పిన్ ఆల్ రౌండర్‌ను ఆడించాలి. ఇద్దరు మెయిన్ స్పిన్నర్ల(కుల్దీప్, వరుణ్)ను ఆడిస్తే బ్యాటింగ్‌లో డెప్త్ ఉండదు. అలాగే వరుణ్‌ను ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేయకుండా తెలివిగా వాడాలి. అభిషేక్ తన బౌలింగ్‌పై దృష్టి పెడితే మంచి ఆల్‌రౌండర్ అవుతాడు’ అని తన YT వీడియోలో అభిప్రాయపడ్డారు.