News January 16, 2026
BREAKING: NGKL జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దపూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన లారీ.. RTC బస్సును, బైకును ఢీకొట్టింది. బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 17, 2026
రాగి పంటకు నీరు అందించడంలో జాగ్రత్తలు

రాగి పంటకు నీటిని అందించే విషయంలో రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. నాట్లు వేసిన రాగి పొలంలో పైరు బాగా వేర్లు తొడిగే వరకు అంటే సుమారు 10 రోజుల వరకు నీరు పెట్టకూడదని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రాగి పంట సాధారణంగా వర్షాధార పంట అయినప్పటికీ కీలక దశలైన మొలకెత్తే దశ, పూత, గింజ పాలు పోసుకునే దశల్లో నీటి తడులను ఇస్తే దిగుబడి బాగుంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
News February 17, 2026
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 46 పోస్టులు.. అప్లై చేశారా?

ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గుజరాత్ స్పోర్ట్స్ కోటాలో 46 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, టెన్త్ అర్హతతో పాటు క్రీడల్లో( జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా ) పతకాలు సాధించినవారు FEB 21 వరకు అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు 18-25ఏళ్ల మధ్య, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు 18-27ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, DV ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: incometaxgujarat.gov.in
News February 17, 2026
జహీరాబాద్ మున్సిపల్ పీఠం.. వీడిన ఉత్కంఠ

జహీరాబాద్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఛైర్మన్గా 5వ వార్డు కౌన్సిలర్ యూనుస్, వైస్ ఛైర్మన్గా 16వ వార్డు కౌన్సిలర్ శిరీష రెడ్డి ఎన్నికయ్యారు. సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్, ఖేడ్, కోహీర్ కాంగ్రెస్ కైవసం చేసుకోగా, పటాన్చెరు పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది.


