News August 21, 2024
BREAKING: వైసీపీ కార్యాలయానికి నోటీసులు

AP: మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాశ్కు పోలీసులు నోటీసులిచ్చారు.
Similar News
News January 11, 2026
పిండి వంటల్లో బెల్లం వాడుతున్నారా?

సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా పిండి వంటల ఘుమఘుమలే. అయితే తీపి వంటకాల్లో పంచదారకు బదులు బెల్లం వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం, విటమిన్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. శరీరంలో చేరిన మలినాలను బయటకు పంపేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది.
News January 11, 2026
సంక్రాంతి: సిరి సంపదల కోసం ఆరోజు ఏం చేయాలంటే?

సంక్రాంతినాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్యుడిని ఆరాధించాలి. హరిదాసులు, గంగిరెద్దులను సత్కరిస్తే వల్ల విష్ణుమూర్తి, నందీశ్వరుల కృప లభిస్తుంది. నువ్వుల నీటితో శివాభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయని, ఆర్థికాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పేదలకు వస్త్రాలు, అన్నదానం చేయడం, గోపూజ నిర్వహించడం వల్ల పాపాలు తొలగి, పుణ్యఫలం లభిస్తుంది.
News January 11, 2026
ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ దోస్తీ.. మరోసారి బయటపడిందిలా..!

పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా నేత సైఫుల్లా కసూరి.. పాకిస్థాన్లోని ఒక స్కూల్ ఫంక్షన్లో ప్రసంగించడం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ తనకు ఇన్విటేషన్లు పంపుతుందని, చనిపోయిన సైనికుల అంత్యక్రియలకు తనని పిలిచి ప్రార్థనలు చేయిస్తారని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇండియా తనని చూస్తేనే భయపడుతుందంటూ ఈ వేదికపై విషం చిమ్మాడు.


