News August 21, 2024
BREAKING: వైసీపీ కార్యాలయానికి నోటీసులు

AP: మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాశ్కు పోలీసులు నోటీసులిచ్చారు.
Similar News
News December 26, 2025
మానసిక ధైర్యాన్ని అందించే మహాకాళి అమ్మవారు

దశమహావిద్యలలో మొదటి రూపమైన శ్రీ మహాకాళీ దేవి శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం. కృష్ణ వర్ణంతో ప్రకాశించే ఈమెను ఆరాధిస్తే సకల వ్యాధులు, గ్రహ దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయని నమ్మకం. తంత్రోక్త మార్గంలో ఈ మహావిద్యను ఉపాసించే వారికి మానసిక ధైర్యం, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో విజయం లభిస్తుంది. సాధకులకు రక్షణ కవచంలా నిలిచి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.
News December 26, 2025
వంట గ్యాస్ సిలిండర్ లీకైతే..

*LPG లీకైతే కుళ్లిన గుడ్లు లేదా సల్ఫర్ లాంటి వాసన వస్తుంది
*గ్యాస్ లీకైన వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి
*చిన్న స్పార్క్ కూడా పేలుడుకు కారణం అవ్వొచ్చు. అందుకే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ స్విచ్లు ఆన్/ఆఫ్ చేయొద్దు.
*డోర్లు, కిటికీలు తెరవండి. దీనివల్ల గ్యాస్ బయటకు వెళ్తుంది.
*లీక్ అవుతూనే ఉంటే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. ఎమర్జెన్సీ నంబర్ 1906కి కాల్ చేయండి
Share it
News December 26, 2025
మన కరెంటుతోనే బంగ్లాదేశ్కు వెలుగు.. స్విచ్ ఆఫ్ చేస్తే..!

చేసిన సాయాన్ని మరచి, స్థాయికి మించిన మాటలతో భారత్ను కవ్విస్తోంది బంగ్లాదేశ్. కానీ గ్యాస్ కొరత, ప్లాంట్లలో సమస్యలతో కరెంటు కోసం మనపైనే ఆధారపడుతోంది. ఏడాదిలో ఇది 70% పెరిగింది. బంగ్లాకు అవసరమైన మొత్తం విద్యుత్లో 17% మనమే సరఫరా చేస్తున్నాం. సగటున రోజూ 2,300 MW సప్లై జరుగుతోంది. ఇందులో అగ్రభాగం అదానీ పవర్ ద్వారా సాగుతోంది. బంగ్లా ఇలానే తోక జాడిస్తే.. మనం ‘స్విచ్’ ఆఫ్ చేస్తే చాలు. మీరేమంటారు?


