News August 21, 2024

BREAKING: వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

AP: మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.

Similar News

News January 10, 2026

చెరకులో బడ్ చిప్ పద్ధతి వల్ల ప్రయోజనాలు

image

బడ్ చిప్ పద్ధతిలో పెంచిన చెరకులో సాంద్రపద్ధతి కంటే ఎక్కువ పిలకలు, ఏకరీతిగా ఎదుగుదల ఉండి.. గడల సంఖ్య, గడ బరువు, చెరకు దిగుబడి, చక్కెర శాతం అధికంగా ఉంటుంది. బడ్ చిప్ మొలకల ద్వారా నీరు, నమయం, కీలక వనరులను ఆదా చేయవచ్చు. ఎక్కువ దూరంలో మొలకలను నాటడం ద్వారా అంతర పంటలు వేసుకొని అదనవు ఆదాయం పొందవచ్చు. బడ్ చిప్ సేద్యంలో యాంత్రీకరణకు సౌకర్యంగా ఉండి, రైతులకు నికర ఆదాయం ఎక్కువగా రావటానికి అవకాశం ఉంటుంది.

News January 10, 2026

OFFICIAL: రాజాసాబ్‌కు ఫస్ట్ డే రూ.112 కోట్లు

image

ప్రభాస్-మారుతి కాంబోలో వచ్చిన రాజాసాబ్ తొలిరోజు కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఏకంగా ఈ మూవీ ఫస్ట్‌డే వరల్డ్ వైడ్‌గా రూ.112 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. హారర్ ఫాంటసీ కేటగిరీలో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ అంటూ ట్వీట్ చేసింది.

News January 10, 2026

దక్షిణమూర్తి పూజ

image

వ్యాపారంలో ఆటంకాలు, ఉద్యోగంలో ఒత్తిడి, పిల్లల చదువు, కెరీర్ విషయంలో గందరగోళానికి గురవుతున్నారా? అయితే దక్షిణమూర్తి స్వామిని పూజించడం వల్ల మేధస్సు పెరిగి, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి లభిస్తుంది. చదువు, కెరీర్, వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ పవిత్ర సమయంలో స్వామి కృప కోసం మీ పేరు, గోత్రంతో పూజలో పాల్గొని విజయాలను పొందడానికి వేదమందిర్‌లో ఇప్పుడే <>బుక్ చేసుకోండి<<>>.