News March 9, 2025

BREAKING: NRPT: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

మరికల్ మండల కేంద్రంలోని భవాని దాబా దగ్గర శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు మరికల్ పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మరికల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ ఎస్ఐ రామ తెలిపారు.

Similar News

News October 22, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన కలెక్టర్, ఎస్పీ
✓దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
✓చుంచుపల్లి: 3 ఇంక్లైన్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
✓మత్తు పదార్థాలతో జీవితాలు చిత్తు: మణుగూరు డీఎస్పీ
✓ములకలపల్లిలో పర్యటించిన కలెక్టర్
✓పాల్వంచ SHOను సస్పెండ్ చేయాలి: ఆదివాసి జేఏసీ
✓మణుగూరు:డివైడర్ ను ఢీ కొట్టిన బైక్ యువకుడికి గాయాలు
✓దమ్మపేట, కరకగూడెం మండలాల్లో దంచి కొట్టిన వర్షం

News October 22, 2025

డీఏ జీవోలో మార్పులు

image

AP: రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలు కలిపేలా నిన్న ఇచ్చిన జీవోలో ప్రభుత్వం మార్పులు చేసింది. డీఏ బకాయిల్లో 10 శాతాన్ని ఏప్రిల్‌లో చెల్లించాలని, మిగిలిన 90% బకాయిలు తదుపరి 3 వాయిదాల్లో (2026 ఆగస్టు, నవంబర్, 2027 ఫిబ్రవరి) చెల్లించాలని సవరణ జీవో రిలీజ్ చేసింది. OPS ఉద్యోగుల పెండింగ్ డీఏలను GPF ఖాతాకు జమ చేయాలని, CPS, PTD ఉద్యోగులకు 90% బకాయిలు నగదుగా ఇవ్వాలని నిర్ణయించింది.

News October 22, 2025

HYD: రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశం: పొంగులేటి

image

రైతును రాజు చేయాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది అధిక వర్షాలకు పత్తి దిగుబడి తగ్గిందని, పత్తి రైతులను ఆదుకుంటామని తెలిపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెడితే అధికారులను ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.