News March 9, 2025

BREAKING: NRPT: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

మరికల్ మండల కేంద్రంలోని భవాని దాబా దగ్గర శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు మరికల్ పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మరికల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ ఎస్ఐ రామ తెలిపారు.

Similar News

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

News December 1, 2025

నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్‌ల నామినేషన్ల ఆమోదం

image

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. ​అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.

News December 1, 2025

KNR: ‘సారీ సర్.. మేం ఒప్పుకోం.. నిలుస్తాం, గెలుస్తాం’

image

మొదటి విడత గ్రామపంచాయతీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక బరిలో నిలిచే అభ్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. ఆయా పార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులు 5- 10 వరకు నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో నామినేషన్ ఉపసంహరణకు నేతలు ప్రయత్నిస్తుంటే ‘సారీ మేము ఒప్పుకోం.. బరిలో నిలుస్తాం, గెలుస్తాం’ అని పోటీదారులు చెబుతుండడంతో నేతలు అవాక్కవుతున్నారు. ఉపసంహరణకు ఎల్లుండి లాస్ట్ డేట్ కావడంతో బుజ్జగింపుల ప్రక్రియను ముమ్మరం చేశారు.