News October 16, 2024

BREAKING: సజ్జలకు పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రేపు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

Similar News

News January 30, 2026

T20WCలో 300 స్కోర్.. ఆ రెండు జట్లకు సాధ్యమే: రవిశాస్త్రి

image

T20WCలో 300 పరుగుల మార్క్‌ను భారత్, ఆస్ట్రేలియాలు సాధించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఆ జట్లలో విధ్వంసకర ప్లేయర్లు ఉన్నారని, టాపార్డర్‌లో ఒకరు సెంచరీ చేస్తే టీమ్ స్కోర్ 300కు చేరుతుందని పేర్కొన్నారు. కాగా T20WCలో శ్రీలంక అత్యధికంగా 260/6 స్కోర్ చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో ENG(230), SA(229), IND(218) ఉన్నాయి. T20Iలలో ZIM 344, NEP 314, ENG 304 రన్స్ చేశాయి.

News January 30, 2026

నేను వెళ్లను.. పుతిన్‌నే రమ్మనండి: జెలెన్‌స్కీ

image

శాంతి చర్చల కోసం మాస్కోకు రావాలంటూ <<18997519>>రష్యా పంపిన ఆహ్వానాన్ని<<>> ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారు. ‘ట్రంప్, పుతిన్‌ను కలిసేందుకు నేను రెడీ. రష్యా తప్ప ఏ దేశానికైనా చర్చలకు వెళ్తా. నేనే పుతిన్‌ను కీవ్‌కు ఆహ్వానిస్తున్నా. ఆయన్ను రానివ్వండి.. అదీ ధైర్యం చేయగలిగితే’ అని అన్నారు. తాము యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నామని, ఉద్రిక్తతలను తగ్గించే చర్యలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

News January 30, 2026

గొడవలో ‘వెళ్లి చావు’ అనడం నేరమా?.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

image

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇవే ఆరోపణలతో అరెస్టయిన ఓ వ్యక్తి శిక్షను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. భర్త అక్రమ సంబంధంపై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భర్త ‘వెళ్లి.. చావు’ అని భార్యతో అన్నాడు. దీంతో ఆమె కూతురితో కలిసి సూసైడ్ చేసుకోవడంతో భర్తపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు సమర్థించగా, హైకోర్టు కొట్టేసింది.