News June 4, 2024
Breaking: ప్రజ్వల్ రేవణ్ణ లీడింగ్

ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన నేత ప్రజ్వల్ రేవణ్ణ. జేడీఎస్ నుంచి ఆయన హసన్లో సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లీడింగులో ఉన్నారు. ప్రత్యర్థిపై 2327 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మండ్య నుంచి కుమార స్వామి 100937 ఓట్ల లీడింగులో ఉన్నారు. కోలార్ నుంచి అదే పార్టీ నేత మల్లేశ్ బాబు 70485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News December 1, 2025
గర్భిణుల్లో వికారానికి కారణమిదే..

ప్రెగ్నెన్సీలో వికారం కామన్. అయితే ఇది గర్భంలోని శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి, హానికర పదార్థాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. శిశువు DNAలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్ బాడీగా భావిస్తుంది. కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేనిమీదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.
News December 1, 2025
దేవుడు మీకేం ఇవ్వలేదని బాధపడుతున్నారా?

పురాణాల్లో దేవుడు కొందరికి ఎన్నో గొప్ప వరాలిచ్చాడని, మాకేం ఇవ్వలేదని కొందరు బాధ పడుతుంటారు. కానీ సమస్త మానవాళికి ఆయన ఓ గొప్ప వరాన్ని అందించాడు. అదే మనకు జ్ఞాన మార్గాన్ని చూపించే ‘భగవద్గీత’. మనిషి మనిషిగా జీవించేందుకు, ధర్మబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ఇంతకంటే గొప్ప బహుమానం, వరం ఇంకేమైనా ఉంటుందా? అందుకే గీతా పారాయణం చేయాలంటారు పెద్దలు. గీతా పారాయణం చేద్దాం.. దేవుడిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకుందాం!
News December 1, 2025
ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

AP: దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది. పని జరిగే ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో అటెండెన్స్ తీసుకుంటారు. 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. రెండుమూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది.


