News June 4, 2024
Breaking: ప్రజ్వల్ రేవణ్ణ లీడింగ్

ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన నేత ప్రజ్వల్ రేవణ్ణ. జేడీఎస్ నుంచి ఆయన హసన్లో సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లీడింగులో ఉన్నారు. ప్రత్యర్థిపై 2327 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మండ్య నుంచి కుమార స్వామి 100937 ఓట్ల లీడింగులో ఉన్నారు. కోలార్ నుంచి అదే పార్టీ నేత మల్లేశ్ బాబు 70485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News September 18, 2025
అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.
News September 18, 2025
బంధాలకు భయపడుతున్నారా?

గామోఫోబియా అనేది రిలేషన్షిప్కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్మెంట్కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
News September 18, 2025
ప్రపంచ వెదురు దినోత్సవం – చరిత్ర

ప్రపంచ వెదురు సంస్థ(WBO) 8వ సమావేశం బ్యాంకాక్లో 2009లో జరిగింది. దీనికి 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వెదురు ప్రాధాన్యతను గుర్తించి ఏటా సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించగా.. ప్రతినిధులంతా ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా SEP-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తూ.. వెదురు ప్రాముఖ్యత, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరిస్తున్నారు.