News June 4, 2024
Breaking: ప్రజ్వల్ రేవణ్ణ లీడింగ్

ఈ లోక్సభ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదమైన నేత ప్రజ్వల్ రేవణ్ణ. జేడీఎస్ నుంచి ఆయన హసన్లో సిట్టింగ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం లీడింగులో ఉన్నారు. ప్రత్యర్థిపై 2327 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మండ్య నుంచి కుమార స్వామి 100937 ఓట్ల లీడింగులో ఉన్నారు. కోలార్ నుంచి అదే పార్టీ నేత మల్లేశ్ బాబు 70485 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News April 12, 2026
IPL: నేడు డబుల్ మజా

IPLలో భాగంగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30కు లక్నో వేదికగా LSG, గుజరాత్ తలపడనున్నాయి. ఈ జట్ల మధ్య జరిగిన ఏడు మ్యాచుల్లో GT 4, LSG 3 గెలిచాయి. ఇక 7.30కి ముంబై వేదికగా MI, RCB మధ్య హైఓల్టేజ్ పోరు ప్రారంభం కానుంది. 34 సార్లు ఈ టీమ్స్ తలపడగా, 19 విజయాలతో MIదే పైచేయిగా ఉంది.
News April 12, 2026
MPTC, ZPTC ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనా?

TG: రాష్ట్రంలో MPTC, ZPTC ఎన్నికల నిర్వహణపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మే 11 నుంచి జూన్ 9 వరకు జనాభా లెక్కల ప్రక్రియ జరగనుండటమే ఇందుకు కారణం. ఒకవేళ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలనుకుంటే జనగణన ప్రారంభానికి ముందే పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉంది. కానీ ఇంత తక్కువ సమయంలో నిర్వహణ కష్టం. దీంతో జనగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
News April 12, 2026
యుద్ధం.. ఇరాన్కు రహస్యంగా చైనా ఆయుధాలు?

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నా ఉద్రిక్తతలు తగ్గడంలేదు. ఈ క్రమంలో చైనా రహస్యంగా ఇరాన్కు ఆయుధాలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోందని US నిఘా వర్గాలు చెబుతున్నాయి. కొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇరాన్ అందుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అయితే తాము ఏ పక్షానికీ ఆయుధాలను అందించడం లేదని చైనా స్పష్టంచేసింది. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ వాషింగ్టన్లోని చైనా ఎంబసీ మండిపడింది.


