News August 21, 2025
BREAKING: సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ

AP: గ్రామ, వార్డు సచివాలయల్లో 2,778 డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 1,785 గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా 993 కొత్త పోస్టులను మంజూరు చేసింది. చింతూరు CHCని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు నాలా పన్ను 4 శాతంలో 70శాతం స్థానిక సంస్థలకు, 30శాతం అథారిటీలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.
Similar News
News August 21, 2025
రేపు తెలంగాణ బంద్.. పెరుగుతున్న మద్దతు

TG: మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా OU జేఏసీ పిలుపునిచ్చిన రేపటి <<17475943>>తెలంగాణ బంద్కు<<>> మద్దతు పెరుగుతోంది. యాదాద్రి జిల్లా వ్యాపారులు రేపు షాపులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ సహా నల్గొండ జిల్లాలోని హాలియా, దేవరకొండలో బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు.
News August 21, 2025
శ్రీశైలం పవిత్రతను దెబ్బతీసే కుట్రలు: రాజాసింగ్

శ్రీశైలంలో దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రిస్టియన్స్ ఆక్రమించారని TG MLA రాజాసింగ్ ఆరోపించారు. ‘శ్రీశైలం పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడానికి ఎప్పట్నుంచో కుట్రలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఓట్ బ్యాంక్ కోసం ముస్లింలు, క్రైస్తవులను అక్కడ స్థిరపరిచింది. ఈ విషయం CM చంద్రబాబు, పవన్కు తెలీదా? ఎందుకు వారిని తొలగించట్లేదు? అలాంటి వారిని వెంటనే సున్నిపెంటకు తరలించాలి’ అని విజ్ఞప్తి చేశారు.
News August 21, 2025
BREAKING: రాష్ట్రంలో విషాదం

AP: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేట(మం) బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని చనిపోయారు. మృతులు స్థానిక కాలేజీలో MBA చదువుతున్న దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. నిన్న కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో నీటి కుంటలో ఈతకు వెళ్లిన <<17465047>>ఆరుగురు <<>>చిన్నారులు మృతిచెందారు.