News October 3, 2024

BREAKING: ఓటర్ల తుది జాబితా విడుదల

image

TG: పంచాయతీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 12,867 పంచాయతీల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతర ఓటర్లున్నారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది, అత్యల్పంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లున్నారు.

Similar News

News December 6, 2025

బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలంటే?

image

బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.

News December 6, 2025

భారీ జీతంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఢిల్లీ<<>> మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 7 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్, CS, IT, ఎలక్ట్రికల్), MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్‌కు నెలకు రూ.81,000, మేనేజర్‌కు రూ.97,320 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://backend.delhimetrorail.com

News December 6, 2025

గుడికెళ్లి, దేవుడిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందా?

image

ఆలయాలకు వెళ్లడం అంటే కేవలం దేవుడిని చూడటం కాదు. విగ్రహారాధనలోని రహస్యాన్ని, దర్శనం పరమార్థాన్ని తెలుసుకోవాలి. భగవంతుని గొప్ప లీలలు, గుణాలను మనసులో తలుచుకోవాలి. ఆయనే మనకు శరణం అని గుర్తించాలి. నిరంతరం ఆయనపై ధ్యానం ఉంచుతూ, ఆయనకు నచ్చిన మంచి పనులు చేయాలి. కేవలం దర్శనం కాకుండా, ఈ సత్యాన్ని గ్రహిస్తేనే మనం జీవితంలో మోక్షాన్ని సాధించగలం. <<-se>>#Bakthi<<>>