News January 17, 2025
ఎంపీతో రింకూ సింగ్ ఎంగేజ్మెంట్

IND యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. UPకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో తాజాగా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దీంతో వీరికి సహచర క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రియా సరోజ్ ఇటీవల మచ్లిషహర్ సెగ్మెంట్ నుంచి 25 ఏళ్లకే ఎంపీగా ఎన్నికయ్యారు. ఆమె ఢిల్లీ వర్సిటీలో చదివి సుప్రీంకోర్టు లాయర్గా పనిచేశారు. తండ్రి 3 సార్లు ఎంపీగా గెలిచారు.
Similar News
News January 8, 2026
ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్కు ఎంపిక చేయకుండా ఫూలిష్గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.
News January 8, 2026
రాత్రి పూట ఇవి తినొద్దు: వైద్యులు

నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఆకలి, నిద్రను కంట్రోల్ చేసుకునేందుకు ఏది పడితే అది తింటారు. మసాలా, నూనె పదార్థాలు, చిప్స్, బిస్కెట్లు, సాఫ్ట్ డ్రింక్స్కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటివల్ల కడుపులో మంట, గ్యాస్తో పాటు కొవ్వు పెరుగుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ బదులు బాదం, బ్రోకలీ, బెర్రీస్, సలాడ్స్ వంటి హెల్తీ ఫుడ్ తీసుకెళ్లాలని, నీరు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు.
News January 7, 2026
ఒప్పో సబ్ బ్రాండ్లుగా రియల్మీ, వన్ ప్లస్.. కారణమిదే!

చైనా మొబైల్ కంపెనీలు రియల్మీ, వన్ ప్లస్ ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్లుగా మారనున్నాయి. ఒప్పో సారథ్యంలోనే ఇవి పని చేయనున్నాయి. నిజానికి ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ కంపెనీలు BBK ఎలక్ట్రానిక్స్కు చెందినవి. తాజా నిర్ణయంతో వేర్వేరుగా రీసెర్చ్&డెవలప్మెంట్, సేల్స్, లాజిస్టిక్ టీమ్స్ అవసరం ఉండదు. వనరులను సమీకరించుకుని, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో మరింత వృద్ధి చెందాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.


