News April 25, 2024
BREAKING: పెరిగిన బంగారం ధరలు

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 పెరిగి రూ.72,650కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.450 పెరిగి రూ.66,600గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.82,900గా నమోదైంది.
Similar News
News December 16, 2025
మాజీ ఎంపీ రామ్ విలాస్ కన్నుమూత

రామ జన్మభూమి ఉద్యమ నేత, బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి(67) కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రేవా(మధ్యప్రదేశ్)లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో నిన్న చనిపోయారు. వేదాంతి అంత్యక్రియలు ఇవాళ అయోధ్యలో జరగనున్నాయి. ఆయన తన జీవితాన్ని అయోధ్య ఆలయ నిర్మాణం కోసమే అర్పించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2సార్లు MPగా గెలిచారు.
News December 16, 2025
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI)లో 9 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc(జువాలజీ/వైల్డ్ లైఫ్ సైన్స్/ఎకాలజీ/లైఫ్ సైన్సెస్/ఆంథ్రోపాలజీ), పీహెచ్డీ, ఎంఏ(ఆంథ్రోపాలజీ/సోషల్ సైన్సెస్/హిస్టరీ/ఎకనామిక్స్/ఫిలాసఫీ) ఉత్తీర్ణులు అర్హులు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కు రూ.57వేలు+HRA, ప్రాజెక్ట్ అసోసియేట్కు రూ.35వేలు+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://zsi.gov.in
News December 16, 2025
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.


