News December 8, 2024
BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Similar News
News October 14, 2025
టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నవంబర్ నుంచే?

TG: ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో చదువుతూ స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు నవంబర్ నుంచే స్నాక్స్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. గతంలో సంక్రాంతి సెలవుల తర్వాత ఈ క్లాసులు ఉండగా ఈసారి 100% ఉత్తీర్ణత కోసం దసరా తర్వాత నుంచే మొదలయ్యాయి. దీంతో ముందుగానే స్నాక్స్ అందిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం వస్తే ఉడకబెట్టిన బొబ్బర్లు, శనగలు, పల్లీలు-బెల్లం వంటివి అందించనున్నారు.
News October 14, 2025
పొద్దుతిరుగుడులో తెగుళ్ల నివారణకు ఇలా..

వరి కోతల తర్వాత పొద్దుతిరుగుడు పంటను సాధారణ దుక్కి పద్ధతిలో నవంబర్, డిసెంబర్ వరకు విత్తుకోవచ్చు. పంట తొలి దశలో చీడపీడలు, నెక్రోసిస్ వైరస్ తెగులు నివారణకు ఒక కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5ML కలిపి శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 2-3టన్నుల పశువుల ఎరువు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఎకరాకు 30KGల నత్రజని, 36KGల భాస్వరం, 12KGల పొటాషియం వేసుకోవాలి.
News October 14, 2025
విజయానికి 58 పరుగుల దూరంలో..

వెస్టిండీస్తో రెండో టెస్ట్ చివరి రోజు ఆట ప్రారంభమైంది. భారత్ గెలవడానికి మరో 58 రన్స్ అవసరం. దీంతో తొలి సెషన్లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో రాహుల్(25), సుదర్శన్(30) ఉన్నారు. భారత్ ఈ మ్యాచులో గెలిస్తే రెండు టెస్టుల సిరీస్ క్లీన్స్వీప్ అవుతుంది.