News February 16, 2025

BREAKING: బాధితులకు రూ.10 లక్షల పరిహారం

image

ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట బాధితులకు భారత రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది.

Similar News

News November 25, 2025

12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

image

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.

News November 25, 2025

T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

image

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌-2026ను ICC రిలీజ్ చేసింది. తొలి మ్యాచ్ FEB 7న పాక్-నెదర్లాండ్స్ మధ్య కొలంబో వేదికగా జరగనుంది. అదే రోజు టీమ్ ఇండియా ముంబై వేదికగా USAతో తలపడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. IND, PAK, USA, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. మార్చి 8న ఫైనల్ జరగనుంది.

News November 25, 2025

అది సీక్రెట్ డీల్: డీకే శివకుమార్

image

సీఎం మార్పు వ్యవహారం గురించి బహిరంగంగా మాట్లాడాలని అనుకోవడం లేదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. పార్టీలోని నలుగురు-ఐదుగురు మధ్య జరిగిన రహస్య ఒప్పందమని చెప్పారు. తనను సీఎంను చేయాలని హైకమాండ్‌ను అడగలేదని పేర్కొన్నారు. పార్టీకి ఇబ్బంది కలిగించాలని, బలహీనపరచాలని తాను అనుకోనని తెలిపారు. పార్టీ, కార్యకర్తల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన అన్నారు.