News February 16, 2025

BREAKING: బాధితులకు రూ.10 లక్షల పరిహారం

image

ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట బాధితులకు భారత రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది.

Similar News

News December 3, 2025

నవంబర్ అంటే నాకు భయం: రామ్

image

నవంబర్ అంటే తనకు భయమని హీరో రామ్ అన్నారు. గతంలో ఇదే నెల రిలీజైన ‘మసాలా’కు కలెక్షన్లు రాలేదని చెప్పారు. కానీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’పై ఉన్న నమ్మకంతోనే ఆ భయాన్ని పక్కనపెట్టినట్లు వివరించారు. ఇది గొప్ప సినిమా అని ప్రేక్షకులు వెంటనే తెలుసుకుంటారా? లేట్ అవుతుందా? అనే దానిపై చర్చించుకున్నట్లు చెప్పారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా డే-1లోనే కలెక్షన్లు కొట్టేస్తుందని అనుకోలేదని థ్యాంక్స్ మీట్‌లో తెలిపారు.

News December 3, 2025

చిన్న తప్పుతో రూ.లక్షలు కోల్పోతున్నారు!

image

సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌తో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ‘FLAT SIP’ హ్యాబిట్‌తో రూ.లక్షలు కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ‘ఎప్పుడూ ఒకే అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేయకూడదు. పెట్టుబడి మొత్తంలో ఏడాదికి కనీసం 10% పెంచాలి. Ex: నెలకు ₹10వేలు చొప్పున 20ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే (12% రిటర్న్స్‌తో) ₹99 లక్షలొస్తాయి. అదే ఏటా 10% పెంచుకుంటూ పోతే ₹1.5కోట్ల వరకు వస్తాయి’ అని వివరిస్తున్నారు.

News December 3, 2025

స్టేడియాల్లో సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా?

image

తమ ఆరాధ్య క్రికెటర్లను కలిసేందుకు ఫ్యాన్స్ వెర్రెత్తి పోతున్నారు. గ్రౌండ్లలోకి దూసుకెళ్లి ప్లేయర్ల కాళ్లపై పడుతున్నారు. మొన్న కోహ్లీ, నిన్న హార్దిక్‌పై ఫ్యాన్స్ విపరీత అభిమానం చూపారు. దీంతో జాతీయ స్థాయి ప్లేయర్లు ఆడే స్టేడియాల్లో సెక్యూరిటీపై క్రీడా వర్గాల నుంచి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలా దూసుకొచ్చేవారి వల్ల ఆటగాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అని నిలదీస్తున్నాయి. మీరేమంటారు?