News January 11, 2025
BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.
Similar News
News February 3, 2026
టాటా స్టీల్ మాస్టర్స్ విజేత నొదిర్బెక్

ఉజ్బెకిస్థాన్ గ్రాండ్ మాస్టర్ నొదిర్బెక్ అబ్దుసతారోవ్ ప్రతిష్ఠాత్మక ‘టాటా స్టీల్ మాస్టర్స్’ చెస్ టైటిల్ను గెలుచుకున్నారు. నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ అర్జున్ ఇరిగేశీని 13వ రౌండ్లో ఓడించి.. 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఈ మెగా టోర్నీని సొంతం చేసుకున్నారు. భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 6.5 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచారు.
News February 3, 2026
ధనుష్, సాయి పల్లవి జోడీగా మరో సినిమా

‘మారి 2’ సినిమాతో మెరిసిన ధనుష్, సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. అమరన్ మూవీతో సత్తాచాటిన రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ జంట నటించనుంది. హీరో ధనుష్కు ఇది 55వ చిత్రం. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్గా శ్రీలీల ఎంపిక కాగా.. మరో కథానాయికగా సాయి పల్లవిని సెలక్ట్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.
News February 3, 2026
ఇండియన్ టెక్నాలజీతోనే హైస్పీడ్ రైళ్లు: నిర్మలా సీతారామన్

దేశంలో రాబోయే హైస్పీడ్ రైలు నెట్వర్క్ పూర్తిగా దేశీయ టెక్నాలజీతోనే సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ బుల్లెట్ తరహా రైళ్లు ఇండియన్ టెక్నాలజీతో, మేడ్ ఇన్ ఇండియా కోచ్లతోనే పట్టాలెక్కుతాయని బడ్జెట్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబై-పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై సహా మొత్తం 7 కారిడార్లను బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.


