News January 11, 2025

BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.

Similar News

News January 22, 2026

నైనీ కోల్ బ్లాక్ అంశం.. కేంద్ర బృందం విచారణ

image

TG: రాష్ట్రంలో సంచలనంగా మారిన నైనీ కోల్ బ్లాక్ అంశంపై కేంద్రం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో కేంద్ర బృందం విచారణ జరపనుంది. ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనుంది. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల అంశంలో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే.

News January 22, 2026

రాజధాని నిర్మాణంలో భారీ దోపిడీ: జగన్

image

AP: తమ వారి సంస్థలకు కారుచౌకగా భూములు కేటాయిస్తూ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని YS జగన్ మీడియా సమావేశంలో ఆరోపించారు. ‘రాజధానిలో నిర్మాణ వ్యయాన్ని దారుణంగా పెంచారు. ఒక్కో Sftకి ₹13 వేల వరకు చెల్లిస్తున్నారు. Sftకి ₹5 వేలతో ఫైవ్‌ స్టార్‌ హోటల్ నిర్మించొచ్చు. ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇస్తూ దోపిడీ చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. బెల్టు షాపుల్లో మద్యం అక్రమ అమ్మకాలతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

News January 22, 2026

కొత్త జిల్లాల ఎత్తివేత ప్రచారంపై భట్టి క్లారిటీ

image

TG: కొత్త జిల్లాలను ఎత్తివేస్తారనే ప్రచారానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెరదించారు. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు జిల్లాల రద్దు ప్రస్తావన, అలాంటి ఆలోచన కూడా లేదని కుండ బద్దలుకొట్టారు. ఇక సింగరేణి వివాదంపైనా భట్టి స్పందించారు. సంస్థ ఆస్తులు దోపిడీకి గురికాకుండా కాపాడతామని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో రేపు మాట్లాడతానని వెల్లడించారు.