News January 11, 2025
BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.
Similar News
News January 10, 2026
అయోధ్య రామ మందిరంలో కశ్మీర్ వ్యక్తి హల్ చల్

యూపీలోని అయోధ్య రామమందిరంలో భద్రతా వైఫల్యం తలెత్తింది. కశ్మీర్కు చెందిన అబ్ అహద్ షేక్ D1 గేటు నుంచి ఆలయంలోకి ప్రవేశించి హల్ చల్ చేశాడు. ఆలయ ప్రాంగణంలో నమాజ్ చదివేందుకు ప్రయత్నించాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నినాదాలు చేశాడు. దీనిపై ఆలయ ట్రస్టు స్పందించాల్సి ఉంది.
News January 10, 2026
AIIMS భోపాల్ 128 పోస్టులు.. అప్లై చేశారా?

AIIMS భోపాల్లో 128 సీనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.. అర్హతగల వారు JAN15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. నెలకు జీతం రూ.67,700 చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://aiimsbhopal.edu.in/
News January 10, 2026
ఈ తప్పులతో మెదడుకు ముప్పు

మనం సాధారణం అని భావించే కొన్ని అలవాట్ల వల్ల మెదడుకు ముప్పు కలుగుతుందంటున్నారు నిపుణులు. సరిపడా నిద్ర లేకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైం, ఎక్కువగా ఒంటరిగా ఉండటం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ఈ అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు జ్ఞాపకశక్తిని తగ్గిస్తాయని హెచ్చరిస్తున్నారు.


