News January 11, 2025

BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్‌నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.

Similar News

News December 25, 2025

21 లక్షల Sft విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం

image

AP: అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ‘21 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును నిర్మిస్తున్నాం. 8వ అంతస్తులో CJ కోర్టు, 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లుంటాయి. 2027 నాటికి పనులు పూర్తవుతాయి’ అని వివరించారు. గత ప్రభుత్వం వల్ల పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ఆయన ఇవాళ ప్రారంభించారు.

News December 25, 2025

నిత్య పెళ్లి కూతురు.. 9 మందిని పెళ్లి చేసుకుంది

image

AP: పెళ్లి అంటే కొత్త జీవితానికి నాంది. కానీ ఈ యువతికి మాత్రం సరదా. శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురంలో నిత్య పెళ్లికూతురు వాణి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అమాయక యువకులే టార్గెట్‌గా మేనత్త సహాయంతో 8 మందిని పెళ్లాడింది. వివాహం తర్వాత డబ్బులు, బంగారంతో పరారైంది. తాజాగా బరంపురం యువకుడిని మ్యారేజ్ చేసుకొని ఆరోజు రాత్రే పరారవ్వడంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆమె ఇప్పటికే పలువురిని మోసగించినట్లు బయటపడింది.

News December 25, 2025

అనూహ్య రద్దీ.. శ్రీవాణి టికెట్ల జారీపై TTD కీలక నిర్ణయం

image

తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తిరుమలతోపాటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న శ్రీవాణి టికెట్ బుకింగ్ ఆఫీసుల్లో టికెట్లు ఇవ్వరని టీటీడీ తెలిపింది. మరోవైపు శిలా తోరణం వరకు భక్తులు వేచిచూస్తున్నందున సర్వదర్శనానికి వచ్చేవారిని క్యూ లైన్లలోకి తాత్కాలికంగా అనుమతించడం లేదు.