News January 11, 2025
BREAKING: సంక్రాంతి రద్దీ.. సీఎం కీలక ఆదేశాలు

AP: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సులు, రైళ్లు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల బస్సులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆయా బస్సులకు ముందుగా ఫిట్నెస్ టెస్టులను చేయాలన్నారు. ఎక్కడా ప్రయాణికులు ఇబ్బంది పడొద్దని స్పష్టం చేశారు.
Similar News
News February 5, 2026
రైతు భరోసా ఇప్పుడే వేయాలి: KTR

TG: రైతు భరోసాను మున్సిపల్ ఎన్నికల తరువాత ఇస్తామని CM రేవంత్ చెప్పడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘KCR DECలోనే ఇచ్చేవారు. డిసెంబర్లో వేయాల్సిన డబ్బులు నేటికీ ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికలయ్యాక ఇస్తామనడం ఏమిటి? మున్సిపల్ ఎన్నికలే కదా? రైతులకు ఇచ్చేదానికి ఎవరు అడ్డం పడ్డారు? ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలయ్యాక అంటే ఏరు దాటాక బోడిమల్లన్న అంటారు’ అని సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
News February 5, 2026
మేం వెళ్తున్నాం.. ఫ్లైట్ బుక్ చేశాం: సూర్య

T20 WCలో ఈనెల 15న జరిగే లీగ్ మ్యాచ్ను పాక్ <<19024958>>బాయ్కాట్ చేయడం<<>>పై టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. ‘మేం స్పష్టంగానే ఉన్నాం. వాళ్ల(పాకిస్థాన్)తో ఆడబోమని మేం చెప్పలేదు. అలా అన్నది వాళ్లే. USA, కెనడాతో మ్యాచ్ల తర్వాత మేం కొలంబో వెళ్తాం. మా ఫ్లైట్ బుక్ అయింది. మేం వెళ్తున్నాం’ అని కెప్టెన్స్ మీట్లో చెప్పారు.
News February 5, 2026
అబద్ధాలు కాదు.. చేసింది చెబితే చాలు: CM

TG: పట్టణ ప్రాంతాల్లోని పథకాలు, చేకూర్చిన లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని CM రేవంత్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కాంగ్రెస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలను నాయకులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, టికెట్ రానివారిని కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని, చేసింది చెప్పాలని తెలిపారు. రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామన్నారు.


