News December 21, 2024

విశాఖ జిల్లాలో ఇవాళ స్కూళ్లకు సెలవు

image

AP: అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాంధ్రను గత 2 రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ సెలవు ప్రకటించారు. అన్ని స్కూళ్లు సెలవు ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Similar News

News December 30, 2025

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. కలెక్టర్ కీలక ఆదేశం

image

జిల్లాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రహదారుల విస్తరణ వేగవంతం చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం పాశర్లపూడి జంక్షన్ వద్ద 216 బైపాస్ రోడ్డు పనులను ఆర్డీఓ మాధవితో కలిసి ఆయన పరిశీలించారు. రవాణా సౌకర్యాల మెరుగుదల, ప్రజల భద్రతే లక్ష్యంగా పనులు జరగాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News December 30, 2025

Z: లోన్ తియ్.. ట్రిప్ వెయ్.. రిపీట్!

image

gen-Zలు గొప్పలకై అప్పులు చేస్తున్నారని హెల్తియన్స్ సర్వే వెల్లడించింది. 2025లో లోన్స్ తీసుకున్న 27% gen-Zల మెయిన్ రీజన్ ట్రిప్స్, కన్సర్ట్స్ వంటి లీజర్ యాక్టివిటీస్. R2: కాస్ట్లీ రెస్టారెంట్ ఫుడ్, బ్రాండెడ్ క్లోత్స్, లగ్జరీ లైఫ్ స్టైల్. R3: ఫోన్స్, ల్యాపీ, స్మార్ట్ వాచ్ వంటి టెక్ థింగ్స్. ఇంకో ట్రెండ్.. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం. ఇలా టెక్కులు, సోకుల కోసం Zలు లోన్ సైకిల్‌లో తిరుగుతున్నారు.

News December 30, 2025

పుతిన్ నివాసంపై దాడి వార్తలు.. మోదీ తీవ్ర ఆందోళన

image

పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడి చేసిందన్న వార్తలపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ Xలో పోస్ట్ చేశారు. శాంతి నెలకొనాలంటే దౌత్యపరమైన చర్చలే మార్గమని స్పష్టం చేశారు. ఇలాంటి దాడులు శాంతి యత్నాలను దెబ్బతీస్తాయన్నారు. అందరూ సంయమనంతో ఉండాలని కోరారు. అయితే పుతిన్ నివాసంపై తాము దాడి చేయలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చెబుతున్నవన్నీ అబద్ధాలని కొట్టిపారేశారు.