News March 9, 2025

BREAKING: SLBC టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించారు. టీబీఎం మెషీన్‌లో మృతదేహం ఇరుక్కున్నట్టు నిర్ధారించారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేస్తున్నాయి. అయితే TBM ముందు భాగంలో దుర్వాసన వస్తున్నందున్నారు. ఆచూకీ కోసం 15 రోజులుగా శ్రమిస్తున్నారు.

Similar News

News March 10, 2025

MBNR: చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతి

image

చిన్నచింతకుంట మండలంలో చెక్‌డ్యామ్‌లో పడి గొర్రెల కాపరి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కౌకుంట్ల మం. అప్పంపల్లికి చెందిన మహేశ్(25) తనకున్న గొర్రెలను స్నానం చేయించేందుకు అప్పంపల్లి-ఏదులాపురం మధ్యలో ఉన్న వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం సమీపంలోని నీటి గుంతకు తీసుకొచ్చాడు. గొర్రెలకు స్నానం చేయిస్తుండగా కాలుజారి గుంతలో పడి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News March 10, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

రాజాపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్లకు చెందిన ఓరుగంటి సత్యనారాయణశర్మ(71) తన స్కూటీపై ముదిరెడ్డిపల్లిలో ఓ ఇంట్లో పూజ చేయించేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి వెళ్లేందుకు టర్న్ తీసుకుంటుండగా ఓ బైక్ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 10, 2025

నవాబుపేట : బాలుడిపై కత్తితో దాడి.. అనంతరం పరారీ

image

నవాబుపేట మండలంలో దారుణం జరిగింది. రుద్రారం గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న విజయ్ కుమార్‌పై అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు దాడి చేసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు 108 సిబ్బంది ద్వారా మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విక్రం తెలిపారు.

error: Content is protected !!