News February 14, 2025
BREAKING: రేపు ప్రత్యేక సెలవు

TG: గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. గిరిజన ఉద్యోగులకు రేపు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇస్తున్నట్లు జీవో జారీ చేసింది. అన్ని శాఖల్లో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పబ్లిక్ హాలిడే ఇవ్వాలని గిరిజన సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతుండగా, క్యాజువల్ లీవ్ను మంజూరు చేసింది.
Similar News
News January 17, 2026
సంక్రాంతి 3 కాదు, 4 రోజుల పండుగ

సంక్రాంతి అంటే అందరూ మూడ్రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి, తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షాదులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి.
News January 17, 2026
అధిక ఆదాయాన్నిచ్చే హైబ్రిడ్ కొబ్బరి రకాలు

☛ వైనతేయ గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. ఏటా చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ వశిష్ట గంగ: నాటిన 3-4 ఏళ్లలో కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 125 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 69 శాతం.
☛ అభయ గంగ: నాటిన 4 ఏళ్లకు కాపునకు వస్తుంది. సగటున చెట్టుకు 135 కాయల దిగుబడి వస్తుంది. కొబ్బరిలో నూనె దిగుబడి 72 శాతం. కొబ్బరి నూనెకు ఇది అనుకూలం.
News January 17, 2026
మరో రెండు అమృత్ భారత్ ట్రైన్లు

TG: తెలుగు ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అమృత్ భారత్ కేటగిరీలో మరో 2 కొత్త రైళ్లను కేటాయించింది. చర్లపల్లి-నాగర్కోయల్, నాంపల్లి-తిరువనంతపురం మధ్య ఏపీ మీదుగా నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న PM మోదీ వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి తిరిగే అమృత్ భారత్ రైళ్ల సంఖ్య మూడుకు పెరిగింది.


