News July 29, 2024
BREAKING: ఇవాళే శ్రీశైలం గేట్లు ఓపెన్

శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువన ఉన్న ఆల్మట్టి, తుంగభద్ర, జురాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తోంది. దీంతో ఇవాళే ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్లు ఓపెన్ చేసి నాగార్జునసాగర్కు నీరు విడుదల చేయనున్నారు. తొలుత ఈ నెల 30న గేట్లు ఎత్తాలని అధికారులు భావించారు. కానీ ఊహించని విధంగా వరద వస్తుండటంతో ఇవాళే ఓపెన్ చేయాలని నిర్ణయించారు.
Similar News
News January 16, 2026
YTలో పిల్లల స్క్రీన్ టైమ్ను నియంత్రించవచ్చు!

పిల్లల స్క్రీన్ టైమ్ను నియంత్రించేందుకు యూట్యూబ్ ‘పేరెంటల్ కంట్రోల్స్’ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పిల్లలు యూట్యూబ్ వీడియోలు చూడకుండా పూర్తిగా బ్లాక్ చేయడం లేదా టైమ్ ఫిక్స్ చేయడం వంటివి చేయవచ్చు. ఈ వీడియోలకు పిల్లలు బానిసలుగా మారుతున్నారన్న ఆందోళనల నేపథ్యంలో యూట్యూబ్ ఈ మార్పులు తీసుకొచ్చింది. దీంతోపాటు కిడ్స్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసేలా సైన్-అప్ ప్రక్రియను ఈజీ చేసింది.
News January 16, 2026
రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశం!

జియో పాలిటిక్స్, పాక్ నుంచి ఉగ్రవాదం నేపథ్యంలో రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అనుమతులతో అవసరం లేని ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో 49% వరకు FDIలకు అవకాశం ఉంది. దీన్ని 74% పెంచనుందని ‘రాయిటర్స్’ పేర్కొంది. భారత భాగస్వామి కంపెనీల్లో విదేశీ రక్షణ సంస్థలకు మెజార్టీ వాటాకు అవకాశం కల్పించనుంది. ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని తెలిపింది.
News January 16, 2026
మేడారం జాతర.. 3 రోజులు సెలవులకు డిమాండ్

TG: మేడారం జాతరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు అధికారికంగా సెలవులు ప్రకటించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. 4 రోజుల పాటు జరిగే ఈ గిరిజన జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొంది. ఈ జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేసింది. కాగా జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో అత్యంత వైభవంగా జాతర జరగనుంది.


