News March 17, 2024

BREAKING: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కీలక ఆదేశాలు

image

AP: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హోర్డింగ్‌లు, కటౌట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆలోపు సచివాలయ పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లోని ప్రచార హోర్డింగ్‌లు, కటౌట్లను తొలగించాలన్నారు. షెడ్యూల్ విడుదల కావడంతో నిన్నటి నుంచే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.

Similar News

News March 29, 2025

పాస్టర్ ప్రవీణ్ మ‌ృతి దర్యాప్తు.. పోలీసుల హెచ్చరిక

image

పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి విచారణ పారదర్శకంగా జరుగుతోందని తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఐదు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. సీసీ ఫుటేజీల పరిశీలన, సమాచార సేకరణ జరుపుతున్నాయి. సీఎం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

News March 29, 2025

మూడు రోజులు సెలవులే!

image

ఐటీ ఉద్యోగులకు వరుసగా మూడు రోజులు సెలవులొచ్చాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం (ఉగాది) వీకెండ్ కాగా రంజాన్ సందర్భంగా సోమవారం కూడా సెలవు ఉండనుంది. దీంతో హైదరాబాద్‌ను వీడి సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొందరేమో మూడు రోజులు ట్రిప్స్ లేదా దైవ దర్శనాలకు వెళ్లేందుకు బయల్దేరారు. కొందరికి రంజాన్‌కు సెలవు ఇవ్వలేదని చెబుతున్నారు. మీ ఆఫీసుల్లో సెలవుందా? ఎటైనా వెళ్తున్నారా? COMMENT

News March 29, 2025

రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPనే: లోకేశ్

image

AP: రికార్డులు సృష్టించాలన్నా, వాటిని బద్దలు కొట్టాలన్నా TDPకే సాధ్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘NTR అనే 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం. 43 ఏళ్ల క్రితం ఆయన పార్టీని స్థాపించారు. 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఢిల్లీకి తెలుగువారి సత్తా చూపించారు. మన పార్టీకి గల్లీ, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు. TDP జెండా పీకేస్తారని ప్రగల్భాలు పలికిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారు’ అని పార్టీ ఆవిర్భావ సభలో తెలిపారు.

error: Content is protected !!