News July 18, 2024

పుంగనూరులో మళ్లీ ఉద్రిక్తత.. గాల్లోకి కాల్పులు

image

AP: పుంగనూరులో మరోసారి <<13652288>>ఉద్రిక్తత<<>> నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లోనే ఎంపీ మిథున్ రెడ్డి ఉండటంతో టీడీపీ శ్రేణులు మరోసారి దాడికి యత్నించాయి. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశాయి. దీంతో ఆత్మరక్షణలో భాగంగా మిథున్ రెడ్డి గన్‌మెన్ మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. మరోవైపు తమ కార్యకర్తలను మిథున్ రెడ్డి రెచ్చగొట్టేలా చేస్తున్నారని టీడీపీ మండిపడింది. ఈ ఘటనలో తమ కార్యకర్తలు గాయపడ్డారని తెలిపింది.

Similar News

News November 7, 2025

శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త

image

శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి NOV 14-JAN 21 మధ్య 60 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. మచిలీపట్నం-కొల్లామ్, నర్సాపూర్-కొల్లామ్, చర్లపల్లి-కొల్లామ్ మధ్య ఈ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొంది. ఇవాళ్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలను స్వైప్ చేయండి.

News November 7, 2025

ప్రకాశం జిల్లాలో 16పోస్టులు.. అప్లై చేశారా?

image

ఏపీలోని ప్రకాశం జిల్లాలో శిశుగృహ, బాల సదనంలో 16 ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి సైకాలజీ డిప్లొమా, న్యూరో సైన్స్, LLB,పారా మెడికల్ డిప్లొమా, బీఎస్సీ, బీఈడీ, బీఏ బీఈడీ, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రకాశం జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు.

News November 7, 2025

DECలో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్: మంత్రి కోమటిరెడ్డి

image

TG: రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ ద్వారా డిసెంబర్ 19-21 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందుకోసం రూ.30 లక్షల నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన లోగోను గవర్నర్ జిష్ణుదేవ్ ఇటీవల ఆవిష్కరించారు.