News November 4, 2024

BREAKING: టెట్ ఫలితాలు విడుదల

image

AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <>https://cse.ap.gov.in/ <<>>వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. కాగా త్వరలోనే 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.

Similar News

News December 26, 2025

మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

image

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.

News December 26, 2025

రెండు కేటగిరీల్లో నోబెల్.. రేడియేషన్‌తో మృతి

image

రెండు సైంటిఫిక్ కేటగిరీల(ఫిజిక్స్ (1903), కెమిస్ట్రీ (1911))లో నోబెల్ సాధించిన ఒకేఒక్కరు మేరీ క్యూరీ. ఆమె భర్త పియరీ క్యూరీతో కలిసి 127ఏళ్ల క్రితం ఇదే రోజు రేడియం, పొలోనియం కనుగొన్నారు. ఒట్టి చేతులతో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్‌ పట్టుకోవడంతో వారు ఉపయోగించిన వస్తువులకూ వ్యాపించాయి. రేడియేషన్ కారణంగా బోన్ మేరో బ్లడ్ సెల్స్‌ను ఉత్పత్తి చేయలేకపోవడంతో అప్లాస్టిక్ అనీమియా వచ్చి మేరీ 1934లో మరణించారు.

News December 26, 2025

ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా సంగీతాబారువా పిషరోతి

image

సీనియర్ జర్నలిస్ట్ సంగీతా బారువా పిషరోతి PCI మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అసోంకి చెందిన సంగీత ద వైర్, హిందూ, నేషనల్‌ హెరాల్డ్‌ వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్సింగ్ చేస్తున్న ఆమె తన కెరీర్‌లో విశ్లేషణాత్మక రిపోర్టింగ్, నిబద్ధతతో దూసుకుపోతున్నారు. పిషరోతి ఏకంగా 1,019 ఓట్లతో గెలుపొందగా, ఆమె ప్యానెల్ 21-0 తేడాతో అన్ని పదవులను కైవసం చేసుకుంది.