News November 4, 2024

BREAKING: టెట్ ఫలితాలు విడుదల

image

AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <>https://cse.ap.gov.in/ <<>>వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. కాగా త్వరలోనే 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.

Similar News

News December 30, 2025

చదువుతో పాటు ‘సెల్ఫ్ డిఫెన్స్’ మస్ట్!

image

ఆపద ఎటునుంచి వస్తుందో తెలియదు. అందుకే అమ్మాయిలు ఆత్మరక్షణనే ఆయుధంగా మలచుకోవాలి. ఢిల్లీలో తన తల్లిని తోసేసి గొలుసు లాక్కెళ్లిన దొంగను 14 ఏళ్ల దివ్య వెంటాడి కరాటేతో మట్టికరిపించింది. ఈ సాహసం ఒక ఉదాహరణ మాత్రమే. నేటి సమాజంలో కేవలం చదువు ఒక్కటే సరిపోదు. మానవ మృగాలను ఎదుర్కోవడానికి ప్రతి అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్‌లో శిక్షణ పొందడం మంచిది. మీ కుమార్తెలను ధైర్యవంతులుగా తీర్చిదిద్దండి. share it

News December 30, 2025

తమలపాకు తోటలకు తెగుళ్ల సమస్య

image

తీవ్రమైన తెగుళ్లు తమలపాకు తోటలకు శాపంగా మారాయి. వేరు, మొదలు కుళ్లు, ఆకు కుళ్లు పంటను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. మరోవైపు తమలపాకు తోటలకు నీడనిచ్చే అవిశ చెట్లకు నత్తల బెడద పెరిగింది. ఇవి అవిశ చెట్ల ఆకులను, తమలపాకులను తిని రంద్రాలు చేస్తున్నాయి. దీంతో అవిశ చెట్లు ఎండిపోయి, నీడ లేకపోవడం వల్ల తమలపాకుల నాణ్యత తగ్గి, ధర పడిపోతోంది.

News December 30, 2025

చైనా మాంజా అమ్మేవారి సమాచారమిస్తే రూ.5వేలు: దానం

image

TG: పతంగులు ఎగురవేయడంలో చైనా మాంజా వినియోగంపై పోలీసులు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయినా కొన్ని చోట్ల ఈ మాంజాను వినియోగిస్తున్నారు. దీనిని రహస్యంగా అమ్ముతున్నవారి సమాచారం తనకు ఇవ్వాలని ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ ప్రజలను కోరారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడమే కాకుండా రూ.5వేల ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి కేసులు పెట్టేలా చూస్తామని హెచ్చరించారు.