News June 14, 2024
BREAKING: మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే
* ఆనం రామనారాయణరెడ్డి – దేవాదాయశాఖ
* పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు&అసెంబ్లీ వ్యవహారాలు
* అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ, రిజిస్ట్రేషన్& స్టాంప్స్
* కొలుసు పార్థసారథి – హౌసింగ్, I&PR
* D B స్వామి – సాంఘిక సంక్షేమం, వృద్ధులు&వికలాంగుల సంక్షేమం, సచివాలయం&గ్రామీణ వాలంటీర్
* వాసంసెట్టి సుభాష్ – లేబర్, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్
Similar News
News February 1, 2025
కాంగ్రెస్ MLAల రహస్య సమావేశం?
TG: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ పనులు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ఫామ్హౌస్లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టాప్-5లో ఉన్న ఓ మంత్రి వైఖరిపై వారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గాంధీభవన్లో హాట్టాపిక్గా మారింది.
News February 1, 2025
బడ్జెట్: నిర్మలా సీతారామన్ చీర ప్రత్యేకత ఇదే
బిహార్ రాష్ట్రానికి చెందిన మధుబని ఆర్ట్, పద్మ అవార్డు గ్రహీత దులారి దేవి కళకు గౌరవ సూచకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చీరను ధరించారు. గతంలో మిథిలా ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో క్రెడిట్ ఔట్రీచ్ యాక్టివిటీ కోసం వెళ్లినప్పుడు దులారి దేవిని నిర్మల కలిశారు. మధుబని ఆర్ట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా దులారి దేవి ఈ చీరను బహూకరించి బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ధరించాలని కోరారు.
News February 1, 2025
దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!
TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.