News November 30, 2024

BREAKING: తీరాన్ని తాకిన తుఫాన్

image

ఫెంగల్ తుఫాన్ తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి.

Similar News

News November 18, 2025

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

image

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.

News November 18, 2025

హిడ్మా మృతితో అడవిలో పోరాటం అంతం!

image

హిడ్మా 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని నెల క్రితం వార్తలు వచ్చాయి. అయితే అతడు ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో ఉన్నాడనే సమాచారంతో ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హిడ్మా సహా ఆరుగురు మావోలు చనిపోయారు. గతంలో హిడ్మా.. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. హిడ్మా మృతితో అడవిలో పోరాటం దాదాపు అంతం అయినట్లేనని సమాచారం.

News November 18, 2025

ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్‌ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్‌గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.