News March 21, 2025

BREAKING.. WNP: రోడ్డు ప్రమాదంలో రేషన్ డీలర్ మృతి

image

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. అంబేడ్కర్ నగర్ కాలనీ సమీపంలో జూరాల కాలువ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని చెలిమిల్ల గ్రామానికి చెందిన రేషన్ డీలర్ హనుమంతు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికు తరలించారు. 

Similar News

News February 19, 2026

పార్వతీపురం: ‘పరిపూర్ణమైన వ్యక్తులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలి’

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కేవలం పాస్ కావడమే ప్రధానం కాదని, వారు సమాజంలో నిలదొక్కుకునేలా పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా, వారి జీవనశైలిలో మార్పులు తీసుకురావాలన్నారు.జ

News February 19, 2026

తిరుపతి: ఈ పార్టీలో ఉంటూ మరో పార్టీలో సీటు కోసం..?

image

తిరుపతి జిల్లాకు చెందిన ఓ MLA తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కాకుండా మరో పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఉంటూనే తన కుటుంబంలో నుంచి ఓ వ్యక్తిని పక్క జిల్లా నుంచి మరో పార్టీలో పోటీ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఈ విషయం ఎప్పటికి బయటపడుతుందో వేచి చూడాలి.

News February 19, 2026

గద్వాల: ప్రతి నెల మూడో శనివారం దివ్యాంగుల గ్రీవెన్స్

image

జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ తెలిపారు. ఈ నెల మూడో శనివారం ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు గద్వాల ఐ.డి.ఓ.సి హాల్లో ఈ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత శాఖల అధికారులు హాజరై దివ్యాంగులకు అవసరమైన సేవలు అందజేస్తారని చెప్పారు.