News November 28, 2024

BREAKING: మోదీని చంపుతామని మహిళ బెదిరింపులు

image

ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ మహిళ ఫోన్ చేసి ప్రధాని మోదీపై బెదిరింపులకు పాల్పడింది. ఆయనను చంపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఆయుధం కూడా సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 14, 2025

కాకినాడ సెజ్ భూములు రైతులకు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

image

AP: కాకినాడ సెజ్‌లోని 2,180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములను రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూశాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో 1,551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుల వద్ద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని పేర్కొంది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి.

News October 14, 2025

మోదీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పవన్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంపై Dy.CM పవన్ హర్షం వ్యక్తం చేశారు. ‘$15 బిలియన్ల పెట్టుబడితో విశాఖలో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటవుతోంది. రాష్ట్రంతో పాటు దేశానికి ఇది ఎంతో ముఖ్యం. చాలామందికి ఉపాధి లభించనుంది. యంగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. PM మోదీ, CM CBN, కేంద్ర మంత్రులు సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, సుందర్ పిచాయ్‌కి నా కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2025

కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ.. మైండ్ బ్లోయింగ్

image

‘జైలర్’ మూవీలో కిరీటం చూసి ‘కళ్లు చెదిరిపోయేలా ఉంది వర్మ.. మైండ్ బ్లోయింగ్’ అని డైలాగ్ చెప్పడం గుర్తుందా. ఇప్పుడు నీతా అంబానీ హ్యాండ్‌బ్యాగ్ చూసినా ‘వర్త్ వర్మా.. వేరే లెవల్’ అనాల్సిందే. మనీశ్ మల్హోత్రా దీపావళి వేడుకల్లో నీతూ పాల్గొనగా అందరి దృష్టి ఆమె చేతిలోని బ్యాగ్‌పైనే. ఎందుకంటే దీని ధర ₹17.73కోట్లు. ‘Hermès Sac Bijou Birkin’కి చెందిన అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్‌ తయారీకి 3,025 డైమండ్స్ వాడారట.